కత్తి మహేశ్ అనే పేరు వినగానే మనకి వెంటనే పవన్ కల్యాణ్ లేదా అతని ఫాన్స్ గుర్తుకు వస్తారు . పవన్ అభిమానులు కత్తి మహేశ్ మధ్యన ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే .. ప్రతీ విషయం లో పవన్ ఫాన్స్ తో గిల్లీ కజ్జాలు పెట్టుకుంటాడు అనే పేరు ఉన్న కత్తి మహేశ్ వారితో స్ట్రాంగ్ గా పొరాడి నిలబడ్డ అతికొద్దిమంది లో మొదటి వ్యక్తి అని చెప్పచ్చు.

 

 

గత ఎన్నికల్లో వైకాపా లోకి కత్తి మహేశ్ వస్తున్నాడు అన్నారు కొందరు .. కానీ అలాంటిది ఏమీ జరగలేదు , ఇక మీదట ఏదైనా జరుగుతుందా అనుకున్నారు కానీ ఎలక్షన్ తరవాత కూడా అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు కత్తి మహేశ్ ఎప్పుడూ ఇష్టంగా , సపోర్టింగ్ గా మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి గురించి ఎంతో వెరైటీ గా మాట్లాడాడు.

 

 

ఇదెక్కడి చొధ్యం అని ట్విటర్ లో జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం  జరిగింది అంటే. తాజాగా అమ్మఒడి పథకం విషయం లో జగన్ పెట్టిన ఆంక్షలు చూసి అదే జగన్ కు విపరీతంగా మద్దతు ఇచ్చిన కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి తీవ్ర స్థాయి ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.పవన్ కళ్యాణ్ ను మొదలుకొని మోడీ వరకు ఎవరినీ వదలకుండా సంచలనం రేపిన కత్తి మహేశ్ అకస్మాత్తుగా ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక కూడా ఒక సీక్రెట్ ఉందని తెలుస్తోంది.

 

 

sc సబ్ ప్లాన్ నిధులని ఈ రకంగా అమ్మ ఒడి పథకానికి మళ్ళించడం కరక్ట్ కాదు అంటూ ట్విటర్ లో ఫేస్ బుక్ లో ఫైర్ అయ్యాడు కత్తి మహేశ్ ! ఏం జరుగుతుంది అనేది చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: