ఎందుకు ఇన్ని కుట్రలు.. ఎందుకు ఇంత కక్ష్య.. ఎందుకు ఇంత రాక్షసత్వం ? రైతుల ముసుగులో టీడీపీ.. విప్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారని ఆగ్రహించారు ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఆ ఎమ్మెల్యేపై దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. 

              

పిన్నెల్లిపై హత్యాయత్నం చేశారని.. కారును ధ్వంసం చేశారంటే ఎంత బలంగా ఎంత రాక్షసత్వంగా కొట్టారో అర్ధమవుతోందన్నారు ఆమె. కచ్చితంగా ఎమ్మెల్యేను చంపేందుకు కుట్ర చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె రామకృష్ణారెడ్డి కారుపై దాడి ఘటనను ఖండించారు.

 

వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. హైవేపై పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై హత్యాయత్నం చేశారు.. ఆయన ఇప్పటి వరకు రాజధాని అంశంపై స్పందించనేలేదు.. అలాంటప్పుడు ఆయనపై ఎందుకు దాడి చేశారు.. ఎందుకు టార్గెట్ చేశారో చెప్పండి. చంపేయాలనే దాడి చేశారని అర్ధమౌవుతోంది. 

 

మూడు రాజధానులను స్వాగతించిన గంటా, కేఈపై ఎందుకు దాడులు జరగలేదు? గతంలో ఎన్టీఆర్‌పై చెప్పులు, రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుది.. పరిటాల రవి హత్య సమయంలోనూ అరాచకాలు సృష్టించారు. ఇలా అల్లర్లు, అరాచకాలు సృష్టించడం.. దానిని రాజకీయ లబ్దికోసం వాడుకోవడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు.

              

ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు, ఐదేళ్లలో గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదు? అమరావతి, రైతుల్ని నాశనం చేశావు.. ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు డ్రామాలు ఆడుతున్నావు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటే ఇలా తప్పుదోవ పట్టిస్తున్నావు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: