ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జాతకాల పిచ్చితో ఇటు హిందువులను, అటు క్రైస్తవులను మోసం చేస్తున్నారు. స్వరూపానంద సరస్వతి సలహాతోనే రాజధానిని విశాఖకు మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఐదు కోట్ల ఆంధ్రులను ఇబ్బందులకు గురిచేస్తూ అధికారపార్టీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని జవహర్ పేర్కొన్నారు.  కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజధాని కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ముఖ్యమంత్రి దిగిరాక తప్పదు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు కుట్రలో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చారు. 

 

బూతులు మాట్లాడటంలో మంత్రి కొడాలి నానిని మించిపోయిన పిన్నెల్లి నోరు కడుక్కోవడానికి ఈసారి యాసిడ్‌ పంపిస్తా. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మాచర్ల నియోజకవర్గ ప్రజలను పిన్నెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మగతనం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు దమ్ముంటే ఉద్దండరాయుని పాలెంలో చర్చకు రావాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా ఎందుకు స్పందించలేదని స్పందించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు. 

 

అమ్మఒడి పథకం ప్రకటనలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫోటో ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌కు మేలు చేసే విధంగా మరో ఒప్పందం చేసుకునేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్మోహన్‌ రెడ్డి భేటీ అవుతున్నారు. ఐదు కోట్ల ఆంధ్రులకు మద్దతుగా రాజధాని కోసం పోరాడుతున్న నారా లోకేష్‌ను అరెస్ట్‌ చేయడం దారుణం. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండీ అంబేద్కర్‌నూ గుర్తించలేని స్థితిలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారు. అధికారపార్టీ నేతలు బూతులు మానేసి బాధత్యగా వ్యవహరించడండి. ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని చెప్పారు.  ఈరోజు గుంటూరు హైవే పై రైతులు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ధర్నా కార్యక్రామానికి వేలాది మంది తరలివచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: