అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో టీడీపీ నెత్తికెత్తుకున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుకూల మీడియా సంస్థలు నానా ఇబ్బందులు పడుతున్నాయి.

అమరావతి రైతులకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా చాలు.. వారికి తమ ప్రసార సాధనాల్లో సాధ్యమైనంత ఎక్కువ స్పేస్ ఇస్తున్నాయి. సీఎం జగన్ ను తిడతావా.. అయితే నువ్వు ఎవరైనా సరే.. మాకు వీఐపీవే.. ఇదీ ఆయా మీడియా సంస్థల తీరు.

 

ఇందుకు మచ్చుకు ఓ ఉదాహరణ.. హిందూ మహా సభ చక్రపాణి మహారాజ్ ప్రకటనలు. ఈ చక్రపాణి మహారాజ్ ఎవరో తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందికి తెలుసు. పోనీ ఆయన హిందూ మహాసభ అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందికి తెలుసు. ఆయనకూ అమరావతికీ ఏమిటి సంబంధం.. అయినా సరే ఆయన ఓ స్టేట్ మెంట్ ఇస్తే చాలు.. టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లకు పూనకం వస్తుంది. ఇటీవల ఓ టీవీ ఛానల్ అయితే మరీ దారుణం.

 

ఆయన ఓ ప్రకటన చేశాడంటూ బ్రేకింగులు మీద బ్రేకింగులు వేస్తోంది. ఆ బ్రేకింగులు కూడా ఎలా ఉంటాయో తెలుసా.. ఏయ్.. జగన్ నువ్వు అమరావతిని ఎలా తరలిస్తామో చూస్తాం.. అమరావతిని కదిపితే భూ కంపం వస్తుంది తెలుసా.. అమరావతితో పెట్టుకోకు.. ఈ తరహా బ్రేకింగులు ఉంటాయి. అన్నీ ఆ స్వామీజీ అన్నట్టుగా సదరు ఛానల్ కుమ్మేస్తుంటుంది.

 

ఈ స్వామీజీ బ్రేకింగుల వ్యవహారం దాదాపు పది- పది హేను రోజుల కిందట మొదటగా ఓ ఛానళ్లో వచ్చింది. ఆయన అమరావతి హిందువుల ధర్మక్షేత్రం.. అమరావతి జోలికి వస్తే ఊరుకోం.. రాష్ట్రాన్ని ఏకం చేస్తాం అన్నట్టుగా బ్రేకింగులు వచ్చాయి. మళ్లీ ఆ తర్వాత ఆ స్వామీజీ అమరావతి వచ్చిందీ లేదు.. మళ్లీ వార్తల్లో కనిపించిందీ లేదు. ఆ తర్వాత మరోసారి మంగళవారం రాత్రి మరోసారి సదరు ఛానల్ కు పూనకం వచ్చేసింది.

 

మళ్లీ అదే కథ.. అవే బ్రేకింగులు.. ఏయ్.. జగన్.. అమరావతి జోలికొస్తే ఊరుకోం.. మరి ఈ స్వామీజీకి సదరు ఛానళ్లో ఎందుకంత ప్రయారిటీ.. అంటే కనిపించే ఒకే ఒక్క కారణం.. ఆయన జగన్ ను తిడుతున్నాడు.. జగన్ ను తిట్టేవాడు మాకు వీఐపీ.. ఇదీ తెలుగుదేశం అనుకూల మీడియా తీరు.

మరింత సమాచారం తెలుసుకోండి: