అమరావతి ఉద్యమం క్రమంగా హింసామార్గంలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. పలుచోట్ల ఉద్రిక్తతలు, ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై దాడులు మొదలయ్యాయి. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై మంగళవారం దాడులు జరిగాయి.ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ నేతల దాడి చేశారు. దీన్ని వైసీపీ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. హింసను ప్రేరేపించి దాడులకు పాల్పడితే సహించేది లేదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు.

 

దాడులను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఆయన ఏమన్నారంటే.. ” మేం ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఎన్ని జరిగినా కూడా మా నాయకుడు చూపిన బాటలో ఎక్కడా కూడా చిన్న ఘటనకు పాల్పడిన సంఘటన లేదు. మా నాయకుడు వైయస్‌ జగన్‌పై చివరకు హత్యాయత్నం జరిగినా కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్త, జగనన్న అభిమానులు సంయమనంతో ఉన్నాం. ఎక్కడా దాడులు చేయలేదు. మాకు చేత కాకకాదు. మా నాయకుడు ఒక పద్ధతి మాకు నేర్పారు అన్నారు మంత్రి అనిల్.

 

ఇంకా ఏమన్నారంటే.. “ పదేళ్లు ఒక చిన్న హింస లేకుండా నడిపించారు. అధికారం పోయి పట్టు మని పది నెలలు కూడా కాకముందే చంద్రబాబు గల్లీ స్థాయికి దిగజారిపోయి దాడులు చేయిస్తున్నారు. సిగ్గుచేటు. మేం కానీ కన్నెర్ర చేస్తే..దాడులు మొదలు పెడితే చంద్రబాబు..కాదు కదా టీడీపీ నాయకుడు ఒక్కడు కూడా తిరగలేడు. ఈ రోజు చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజధానిపై రెండు కమిటీలు నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చిస్తోంది.

 

రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు కేవలం తన రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. చంద్రబాబు మాయలో రైతులు పడొద్దని వేడుకుంటున్నా..మా సీఎం ఎవరికి అన్యాయం చేయడు. అక్కడక్కడ వంద మందిని పెట్టుకొని మాపై దాడులు చేస్తే భయపడిపోయే ప్రసక్తే లేదు. మేం దాడులు చేయడం మొదలు పెడితే చంద్రబాబు..నీవు కానీ..నీ కొడుకు కానీ ఎవరు కూడా తిరగలేరు. ఒక్కసారి మేం సహనం కోల్పోయి మేం కూడా దాడులకు పాల్పడితే పరిస్థితి వేరేలా ఉంటుంది.. అంటూ హెచ్చరించారు మంత్రి అనిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: