పాక్ మంత్రులు ఇప్పుడు తిన్నగా ఉండరు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఇటీవలే రైల్వే శాఖామంత్రి మోడీ గురించి తప్పుగా మాట్లాడి కరెంట్ షాక్ కొట్టించుకున్నాడు. మోడీ గురించి తప్పుగా మాట్లాడిన సమయంలోనే మోడీకి కరెంట్ షాక్ కొట్టింది. ఇలా కరెంట్ షాక్ కొట్టడంతో వెంటనే పాక్ మంత్రి బుకాయించుకొని లేదు లేదు ఇది మాములుగా కరెంట్ షాక్ కొట్టింది. దీనికి మోడీకి సంబంధం లేదని అన్నారు.
ఎవరు అడిగారని అంతగా షాక్ అవుతూ చెప్పాల్సిన అవసరం ఏముంది. ఒకరు అలా నోరు జారితే మరొకరు టెక్నాలజీ మంత్రి ఫవాద్ మరో విధంగా నోరు జారారు. ఇటీవలే ఆయనకు టిక్ టాక్ స్టార్ హరిమ్ షా తో సంబంధాలు ఉన్నాయని కొన్ని చానళ్ళు కోడై కూశాయి. దీంతో ఫవాద్ కు కోపం వచ్చింది. ఎంత కోపం వస్తే మాత్రం జర్నలిస్టుపై చేయి చేసుకుంటారా చెప్పండి. వాళ్లపై చేయి చేసుకుంటే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి.
ఖచ్చితంగా పరువు తీస్తారు. అందులో సందేహం అవసరం లేదు. ఫవాద్ చౌదరి అలానే చేశాడు. తన గురించి తప్పుగా వార్తలను ప్రచారం చేశారని చెప్పి ఫవాద్ ఏకంగా జర్నలిస్టు పై చేయి చేసుకోవడం ఆ దేశంలో ఘోరంగా మారిపోయింది. ఫవాద్ చౌదరి ఎందుకు ఇలా చేశారని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. చేయి చేసుకున్న యాంకర్ కు కనీసం ఒక్క సారీ కూడా చెప్పలేదు. సారి చెప్పలేదు సరికదా అతను చేసిందే తప్పు అని అంటున్నాడు ఫవాద్.
ఫవాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జర్నలిస్ట్ పై చేయిచేసుకోవడంతో పాక్ లో అలజడులు జరుగుతున్నాయి. ఫవాద్ జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నారు. జర్నలిస్టు మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. మరి దీనిపై అయన ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో కూడా ఈయన ఇండియాపై ఆరోపణలు చేశారు.