ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేస్తున్నాడు అని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు, అతని సుపుత్రుడు నారా లోకేష్.. ప్రతిపక్షాలు చేసే చిల్లర పనులపై ఘాటుగా స్పందించే విజయసాయి రెడ్డి నేడు వైసీపీ ఎమ్మెల్యేపై జరిగిన దాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. ''మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టిడిపి గూండాలు దాడి చేసి ఆ పిరికి దాడిని అమాయక రైతులపై వేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేసేందుకు చంద్రబాబు చేసిన మరో కుట్ర ఇది.. ప్రజలకు మనశాంతి లేకుండా చేస్తున్నాడు'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు.

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మనిషి కాదు.. మనిషి రూపంలో ఉన్న రక్షేషుడు సర్.. ఇంకా ఇలాంటి వాళ్ళతో మనకు చాల కష్టం అంటూ ట్విట్ చేశారు ఓ నెటిజన్. మరొకరు స్పందిస్తూ.. చంద్రబాబాబు అతని మాఫియా ఎంతకైనా తెగిస్తారు అనటానికి ఈరోజు జరిగిన ఏమ్మెల్యేపై దాడులే నిదర్శనం. ఇటీవల చంద్రబాబు స్వయానా అన్న మాట..రాబోయే ఆరు నెలలో రాష్ట్రంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తా! మన సీఎం జగన్ గారిపై రాజీవ్ గాంధీపై LTTE లాగా ఆత్మహుతి దాడి చేపిస్తాడా? ఏమిటి?'' అంటూ కామెంట్ చేశాడు మరో నెటిజన్. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: