అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. అదే సమయంలో ఒక్క రోజు తేడాతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా రాబోతుంది. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

 

 

ఇకపోతే ఈ రెండు సినిమాల మధ్య లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమా విడుదల కాబోతుంది. ఈ పరిస్థితి లో ఎవరు ఎవరికి పోటీ ఇస్తారు అనేది ప్రశ్నార్థకం గా మారింది. హీరో కల్యాణ్ రామ్ కాస్తంత సత్తా చూపించినా బాగుంటుంది. అతని ట్రెయిలర్ ఇవాలే విడుదల అయ్యింది .. ఎంత మంచి వాడవురా ట్రెయిలర్ ఆసక్తికరంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు కూడా. అయితే సంక్రాంతి బరిలో నిలవడానికి ఇదొక్కటీ సరిపోదు .. ఇవాళ ట్రెయిలర్ లంచ్ కి జూనియర్ ఎన్‌టి‌ఆర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే అసలు ఈ సినిమా ఒకటి వస్తుంది అని ఎవ్వరికీ తెలిసే పరిస్థితి కూడా లేదు.

 

 

ప్రమోషన్ విషయం లో ఈ బృందం అంతగా వెనకపడి ఉంది . సంక్రాంతి పోటీ మహేశ్ - బన్నీ  వీళ్ళే కనిపిస్తున్నారు ..  రజని సినిమాలకు తెలుగు లో అంత క్రేజ్ లేదు. ఆంధ్ర - తెలంగాణ లో దర్బార్ గురించి చాలా తక్కువమందికి తెలుసు.  క‌ళ్యాణ్‌రామ్ ఎంత మంచివాడ‌వురా ఉన్నా ఆ సినిమా బ‌న్నీ, మ‌హేష్ సినిమాకు పోటీ ఇచ్చే సీన్ లేదు.. అందుకే సంక్రాంతి హీరో మ‌హేష్‌, బ‌న్నీల్లో ఎవ‌రొ ఒక‌రే అవుతారు.. అంటున్నారు సినీ పండితులు. సంక్రాంతి పోటీ లో నిలిచే సినిమా లు అన్నీ మంచిగా హిట్ అవ్వాలి అని కోరుకుందాం. సంక్రాంతి బరిలో ఏ సినిమా ఎక్కువ కలక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ??

మరింత సమాచారం తెలుసుకోండి: