ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీ వేదికగా ప్రకటించిన  రాజధాని ప్రకటన గురించి ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధాని అధ్యయనం  కోసం నియమించిన రెండు కమిటీలు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల  నిర్మాణం చేపట్టాలని నివేదికలు అందించడంతో ప్రతిపక్షాల విమర్శలు మరింతగా పెరిగిపోయాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి  సర్కార్ అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి సిబిఐ విచారణ చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతి లో రైతులు రైతు కుటుంబీకులు రోడ్డెక్కి నిరసనలు ఆందోళనలు తెలుపుతున్నారు.  దీంతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది . కాగా  అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతులందరికీ మద్దతు తెలుపుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

 

 

 అమరావతి రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే జగన్మోహన్రెడ్డి సర్కార్ పై ప్రతిపక్షాల  ఏ చిన్న విమర్శ చేసిన వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి దానికి ఘాటుగా బదులిస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన స్టైల్లో ప్రతిపక్షాల విమర్శలను ఎండగడుతూ కౌంటర్ ఇస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి ఇక తాజాగా మరోసారి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైసిపి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి. 

 

 

 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను నిర్వచించాలంటే అవినీతి నమ్మకద్రోహం అబద్ధాలు అని చెప్పాల్సి ఉంటుంది అంటూ విమర్శలు గుప్పించారు విజయ సాయి రెడ్డి. అమరావతిలో భూ మాఫియా కు నాయకత్వం వహించడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవ ఏదీ లేదంటూ విమర్శించారు. ప్రజలను మోసం చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ  కుంభకోణానికి చంద్రబాబు నాయుడు బాటలు పరిచారు అని ఆరోపించారు. అంతేకాకుండా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కరపత్రాలను కూడా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: