అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం రచ్చ రచ్చ చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రయత్నిస్తోంది. బస్సు యాత్ర వంటి ప్రచారాల ద్వారా రాష్ట్రం మొత్తం ఈ అంశంపై చర్చించుకునేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి రాజధానిని కదిలిస్తున్నామంటే రాష్ట్రమంతా కదలాలి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు నిరసనల పేరుతో హల్ చల్ చేస్తున్నారు. విజయవాడ రోడ్డుపై కూర్చునేందుకు కూడా వెనుకాడటం లేదు.

 

అయితే ఇదంతా ఆయన ఆస్తులు కాపాడుకునే పనే అంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చంద్రబాబుకు ఓ కొత్త ఈ క్వేషన్ చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాను. కర్నూలు, విజయవాడ, విశాఖ, తిరుపతి నేనే డెవలప్‌ చేశానని చెప్పే చంద్రబాబు అమరావతిలో ఇడ్లీ పాత్రలు చూపించి ప్రజలను మభ్యపెట్టి సర్వనాశనం చేశాడని నందిగం సురేశ్ ఆరోపించారు. నా వయస్సు అయిపోయింది. నా కుమారుడు రాజకీయంగా పనికి రాడని కనీసం ఆస్తులైనా కాపాడుకొని మనవడికి ఇవ్వాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమతో కాదంటున్నారు నందిగం సురేశ్.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే. “ బాబు నీతి లేని వ్యక్తి, ఒక పద్ధతి, విధానం లేకుండా పెరిగాడు. అబ్బాకొడుకులు ఇద్దరూ పాట్నర్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏడు నెలల పాలన బ్రహ్మాండంగా ఉంది. భవిష్యత్తు దిక్సూచిలా సీఎం వైయస్‌ జగన్‌ కనిపిస్తుంటే.. వీళ్లంతా అది ఓర్వలేక అల్లర్లు సృష్టిస్తున్నారు.. అని విమర్శించారు.

 

ప్రపంచ మేధావిని, భవిష్యత్తు ప్రధానిని అని చెప్పుకొని చతికిలబడి చివరకు 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయాడు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయపడి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే చేసిన తప్పును ఒప్పుకోవాలి.. అని డిమాండ్ చేశారు నందిగం సురేష్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: