2020 జనవరిలోనే దేశంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి.  ఈ అరాచకాలను తట్టుకొని ప్రజలు నిలబడటం అంటే మాములు విషయం కాదు.  ఆరు నెలల పసిపాపల నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు వదలని నీచులు మగాళ్ళపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు.  అక్కడితో ఆగకుండా ఈ నీచులు ఇంకా దారుణాలకు ఒడిగడుతున్నారు.  ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటే అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు.  చివరకు కామాంధులకు పశువులు కూడా కనిపించడం లేదు.  


ఇంతటి దారుణం ఏంటో అర్ధం కావడం లేదు.  ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు.  పశువులను కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్నారు.  రీసెంట్ గా జరిగిన ఈ ఘటన మనుషులపైనే విరక్తి పుట్టేలా చేస్తున్నది.  సమాజం ఎటువైపు పరుగులు తీస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సమాజం పట్ల మనుషుల ప్రవర్తన ఇలా ఉంటుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.  


భారతదేశంలో ఆవును పవిత్రకు చిహ్నంగా కొలుస్తారు.  అవును పూజిస్తే లక్ష్మిదేవిని పూజించినట్టే అంటారు.  అందుకే అవుకు చాలామంది నిత్యం పూజలు చేస్తారు.  గోమూత్రం ద్వారా అనేక వ్యాధులు నయం అవుతాయి.  ఆవు మూత్రాన్ని అనేక ఔషధాల్లో వినియోగిస్తారు.  అంతెందుకు ఆవుపాలు ఎంతటి శ్రేష్ఠమైనవో చెప్పక్కర్లేదు.  ఇలాంటి ఆవును కూడా ఓ కామాంధుడు వదలలేదు.  దారుణంగా రేప్ చేసి తన పశువాంఛను తీర్చుకున్నాడు.  ఈ ఘటన ఎక్కడో కాదు కేరళ రాష్ట్రంలో జరిగింది.  


పాలక్కడ్ జిల్లా మన్నార్‌ కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌  అనే వ్యక్తికి ఓ ఆవు ఉండేది.  ఈ ఆవు జనవరి 5 వ తేదీ నుంచి కనిపించక పోవడంతో వినోద్ చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు.  అయితే ఈ ఆవు జనవరి 8 వ తేదీన గ్రామ శివారులో మృతిచెందిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లారు. ఆవు మర్మాంగాల వద్ద దాడిచేసినట్టుగా గుర్తులు ఉన్నాయి.  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  వెటర్నరీ వైద్యులు ఆవును పోస్ట్ మార్టం చేశారు.  నివేదిక అందాల్సి ఉన్నది.  ఆవును లైంగికంగా హింసించి చంపారని వినోద్ ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: