రోజురోజుకు సమాజంలో తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆడపిల్లలపై రోజురోజుకు అత్యాచారాలు హత్యలు ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికీ ఏ మాత్రం మార్పు రావడం లేదు. దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికి కూడా కామాంధులు అత్యాచారాలు హత్యలు చెయ్యడానికి వెనుకడుగు వేయడం లేదు. కామాంధుల్లో  కాస్తయినా భయం కనిపించడం లేదు. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మహిళలు కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి మీద పడి అత్యాచారాలు చేస్తున్నారు మృగాల్లాంటి  మగాళ్లు. దీంతో మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడపాల్సి వస్తుంది. 

 

 

 ఇక రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవడమే కాదు కామంతో కళ్లు మూసుకుపోయి అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉన్న కామాందులు  ముగా జీవాలను కూడా వదలడంలేదు. తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి ఏదైతే ఏంటి అని భావిస్తున్నా కామాంధులు... మూగజీవాల పై కూడా లైంగిక  పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో తెర మీదికి వచ్చాయి కూడా... కామంతో కళ్లు మూసుకుపోయి అసలు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఎంతోమంది.. మూగ జీవాలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలు  ఇప్పటికే ఎన్నో తెర మీదికి వచ్చాయి. ఇప్పుడు తాజాగా సభ్యసమాజం తల దించుకునే ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు ఓ మూగ జీవి పై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఏకంగా లైంగిక దాడి చేసి మూగ జీవి ప్రాణాలు బలికొన్నారు.  

 

 

 వివరాల్లోకి వెళితే... కళ్ళు మూసుకుపోయిన కామాంధులు ఆడవాళ్లపై నే కాదు మూగజీవాలను వదలడం లేదు ఈ రోజుల్లో. తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి ఏదైతేనేం అనుకుంటూ రాక్షసుల్లా  ప్రవర్తిస్తున్నారు. తాజాగా కేరళలో ఓ మూగ జీవిని పొట్టన పెట్టుకున్నారు. కేరళ పాలక్కడ్  మన్నార్ ఖద్  సమీపంలోని.. మాసపరంబు  గ్రామంలో ఒక ఆవు పై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినోద్ అనే పాల వ్యాపారి తన ఆవుపై కొంతమంది వ్యక్తులు లైంగిక దాడి చేసి చంపేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఆవుకు పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టరు నివేదికను బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: