సమాజంలో కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే అసలు ఈ భూమి మీద మనుషులే జీవిస్తున్నారా, లేక మనుషులు అని చెప్పుకునే రాక్షాసులు జీవిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే తుచ్చమైన కోరిక కామం.. దీనికోసం పెద్దలు ఏర్పరచిన కట్టుబాట్లను కాదని, మనుషులు విచ్చలవిడిగా శృంగారానికి ఎగబడుతున్నారు. అందుకే లోకంలో అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఇది చాలదన్నట్లుగా అప్పుడప్పుడు మూగజీవాలపై విరుచుకు పడుతున్నారు.

 

 

మనిషికి ఉన్న లక్షణాలను ఇంతకాలం పశువుతో పోల్చారు. కాని ఆ పశువుకంటే హీనంగా ఇప్పుడు మనిషి మారాడనిపిస్తుంది. ఒక సంఘటన గురించి తెలుసుకుంటే... కేరళలో ఓ కామపిశాచి ఆవుపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగింది పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామంలో. ఈ గ్రామానికి చెందిన వినోద్‌ అతనికున్న ఆవుల ద్వారా  పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవుల మందనుండి ఒక ఆవు కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన వినోద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు.

 

 

అయితే బుధవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో అతని ఆవు విగతజీవిగా కనిపించింది. అంతేకాకుండా దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్. ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి ఆవు కళేబరాన్ని తరలించారు. అయితే వెటర్నరీ డాక్టర్లు దానికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ నివేదికలో తెలిసిన విషయాన్ని బయటపెట్టలేదు.

 

 

దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే నిజానిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆవుపై అత్యాచారం జరిగిన వార్త పాలక్కాడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇలాంటి ఘటనల గురించి తెలిసినప్పుడు మనం మనుషులం అని చెప్పుకోవడానికే సిగ్గుపడాలని అనిపిస్తుందని జంతు ప్రేమికులు వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: