మధ్యాహ్నం భోజన లో పేద పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చిన చరిత్రకారుడు జగన్ అయితే ఆ పేద పిల్లలు తినే గుడ్లను కూడా మింగేసిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఘాటు విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏకకాలంలో ఆమె ప్రశంసలు, విమర్శల వర్షం కురిపించారు రోజా. రాష్ట్రానికి మంచి చేయాలని నిరంతరం ఆలోచిస్తూ ఉండే చరిత్రకారుడు జగన్ అని, ఆయన జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రి గా ఉండాలంటూ రోజా ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ చరిత్రకారుడు అయితే చంద్రబాబు చరిత్ర హీనుడు అంటూ మండిపడ్డారు.


 అభివృద్ధి చేయలేని, చేతగాని వ్యక్తి చంద్రబాబు అని, పేదల చదువు కోసం అమ్మఒడి అనే గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్ అని ఆమె కొనియాడారు. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఆమె విమర్శలు చేశారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే అయినా వారిద్దరి వల్ల ఈ జిలా ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని ఆమె మండిపడ్డారు. 

 

మాట్లాడితే చాలు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అని చెప్పుకునే బాబు పరిపాలనకు, జగన్ పరిపాలనకు ఉన్న తేడా ఏంటో ప్రజలంతా గుర్తించారని, ముందు ముందు కూడా గుర్తిస్తారని రోజా ఆకాంక్షించారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం ఇంత మంచి పథకాన్ని పెట్టిన ముఖ్యమంత్రి ఇంకెక్కడా ఉండరని, అంత గొప్ప వ్యక్తి జగన్ మాత్రమేనని రోజా అన్నారు. మీ పిల్లల కోసం ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన జగన్ ను తల్లులంతా ఆశీర్వదించాలని రోజా కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: