చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. జగన్ ను ఏకంగా చరిత్రకారుడు అని చెప్పిన రోజా చంద్రబాబును మాత్రం చరిత్ర హీనుడితో పోల్చారు. చేతకాని, అభివృద్ధి చేయలేని వ్యక్తి చంద్రబాబు అని రోజా అన్నారు. 
 
సీఎం జగన్ పేదల చదువు కొరకు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాడని చంద్రబాబు పేదల చదువును కాలేజీలకు, కార్పొరేట్ స్కూళ్లకు బలి చేసిన చరిత్రహీనుడు అని అన్నారు. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి ప్రారంభోత్సవ పథకంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని చేస్తున్న కృషి అభినందనీయం అని రోజా అన్నారు. 
 
ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ జగన్ జీవితాంతం సీఎంగా ఉండాలని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదని రోజా అన్నారు. పేదలు చదివే పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం అనే విత్తును తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్ అని రోజా అన్నారు. 
 
చంద్రబాబు పేదలు చదివే 6,000 పాఠశాలలను మూసివేసిన చరిత్రహీనుడు అని అన్నారు. పేదలకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఇచ్చిన ఘనుడు జగన్ అని అన్నారు. చంద్రబాబు పేద పిల్లలు తినే గుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు అని రోజా అన్నారు. చంద్రబాబు తను చదివిన పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేని చరిత్రహీనుడని రోజా అన్నారు. సీఎం జగన్ నాడు నేడు పథకంలో భాగంగా 45 వేల పాఠశాలలను ఆధునీకరించి అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా చేస్తున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: