ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఈరోజు స్పందిస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు బినామీలను, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధులు కావాలా ? అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?'' అన్నటు ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.  

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఘాటుగా స్పందించారు.. ఓ నెటిజన్ ట్విట్ పెడుతూ.. ''రాయలసీమ రౌడీలు రాయలసీమ గూండాలు కాదు ఇప్పుడు అమరావతి గుండాలుఅమరావతి రౌడీలు, నాడు జగన్ కి అధికారంవస్తే గుండాయిజం చేస్తాడు అన్నారు, ఇప్పుడు టిడిపి వాళ్ళు చేస్తుంది ఏంటనేది ప్రజలు ఆలోచించాలి. '' అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ చుసిన మరి కొందరు నెటిజన్లు.. అవును సోదర అంటూ మరికొన్ని ట్విట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్లను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: