ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఈరోజు స్పందిస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. జిల్లాల నుంచి  వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి కిరసనాయిలు మ్యాప్ వేసి పేజి అంతా పర్చాడు అంటూ విజయసాయి రెడ్డి నిన్న ట్విట్ చేశారు.    

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి కిరసనాయిలు మ్యాప్ వేసి పేజి అంతా పర్చాడు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలు మధ్యలో లేవని ప్రజలందరికీ తెలుసు. దీనికంటే ‘కడుపు మంటను’ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం వైఎస్ జగన్ గారిని కోరవచ్చు గదా?'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఘాటుగా స్పందించారు.. ఓ నెటిజన్ ట్విట్ పెడుతూ.. ''ఈ సన్నాసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చాపురం నుండి హైదరాబాద్ ఎంత దూరం ఉండేదో తెలుసుకోమనండి, ఇప్పుడు జగన్ వచ్చాక మాకు దగ్గరలో విశాఖలో ఒక్క సచివాలయం పెడితేనే ఏడ్చి మొత్తుకుంటున్నాడు, వీడి సొమ్మేదో పోయినట్లు. వీడి పచ్చ ఛానల్, పేపర్లని ఉత్తరాంధ్ర ప్రజలు బహిష్కరించాలి.'' అంటూ ట్విట్ చేశాడు ఓ నెటిజన్. ఈ ట్విట్ చుసిన మరి కొందరు నెటిజన్లు.. అవును సోదర బ్యాన్ చేసి పడేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: