నటుడు పోసాని కృష్ణ మురళి పృథ్వి రాజ్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం మహిళా రైతులు అంత కష్టపడుతుంటే వారిని అవమానించే మాటలు మాట్లాడుతారా ? అంటూ అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు పదవి ఇచ్చాడు... భక్తుడుకు భగవంతుడికి అనుసంధానమైన పదవి అది.. సేవ చేసుకో. నువ్వు చీఫ్గా చంద్రబాబు కమ్మ వర్గం కోసం ఈ పని చేస్తున్నాడు అనడం తప్పు.
ఎన్టీఆర్, చంద్రబాబు కమ్మ సామాజికవర్గం కోసం కమ్మవాళ్లు సొసైటీలో బతకడం లేదు.. కమ్మ వర్గం ఆత్మగౌరవంతో పొలం పనులు చేసుకుంటూ పోతున్నారు. పృథ్వి నువ్వు కమ్మ వాళ్లను రోడ్డు మీదకు ఈడ్చావు. ఫెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి పృథ్వి.. సంవత్సరానికి మూడు పంటలు పండుతున్నాయి... వాళ్లు రాజధాని వస్తే రాష్ట్రం బాగుపడుతుందని భూములు ఇచ్చారు.
కమ్మ వాళ్లకు ఆత్మగౌరవం లేదా కమ్మ వాళ్లనే తిట్టావా. కమ్మ రైతులను తిట్టావా నీ కర్మ అది కమ్మ ఆడపడుచులు రోడ్ల మీదకు వచ్చారు... ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్లలో రెడ్లు లేరా, కమ్మలు లేరా, బలహీన వర్గాలు లేరా... కాపులు లేరా... అంటూ అయన ఏకధాటిగా పృథ్విపై ప్రశ్నల వర్షం కురిపించారు నటుడు పోసాని.
అంతేకాదు.. ఒక్క పృథ్విపై మాత్రమే కాదు నగరి ఎమ్మెల్యేపై రోజాను కూడా అయన తెరపైకి తీసుకువచ్చారు. రోజా తాను పదేళ్ల నుండి పార్టీలో ఉన్నట్టు.. పృథ్వి పార్టీలోకి వచ్చి మూడు నాలుగేళ్లే అయ్యింది అని అయన వ్యాఖ్యానించాడు. దీంతో పోసాని మురళి కృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.