ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య మరో వార్ మొదలైంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ కమ్ పొలిటిషియన్ పృథ్వీని సినీ రచయిత, నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఉతికి ఆరేశారు. పృథ్వీ వైసీపీ నాయకుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన్ను జగన్.. ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ ను కూడా చేసేశారు. అలాగే పోసాని కృష్ణ మురళీ కూడా వైసీపీలోనే ఉన్నారు. కాకపోతే.. పృధ్వీలాగా యాక్టివ్ పాలిటిక్స్ లో పెద్దగా కనిపించరు.
అయితే ఉన్నట్టుండి.. పోసాని కృష్ణమురళి పృథ్వీపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల పృథ్వీ అమరావతి రైతులపై విమర్శలు చేశారు. ఆందోళన చేస్తున్నది రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. గురువారం మరో అడుగు ముందుకేసి.. పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ అంశంపై స్పందించిన పోసాని కృష్ణ మురళి పృథ్వీరాజ్ ను ఏకిపారేశారు.
“ నువ్వు అర్థం పర్థం లేకుండా సబ్జెక్ట్ తెలియకుండా నీ మెహర్బానీ కోసమే ఇలా మాట్లాడావు.. అంటూ పృథ్వి అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ చేసిన వ్యాఖ్యలను వీడియో ప్లే చేసి మరీ చూపించి పృథ్విని ఆడేసుకున్నారు. పృథ్విపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ ఆవేశంతో ఊగిపోయారు. సబ్జెక్ట్ తెలియకుండా ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు.
అయితే పృథ్వీరాజ్ ఈ పెయిడ్ ఆర్టిస్టులు అన్న డైలాగ్ అని ముూడు, నాలుగు రోజులకు పైనే అవుతోంది. అయితే ఉన్నట్టుండి ఎందుకు పోసాని కృష్ణ మురళి పృథ్వీపై ఫైర్ అయ్యాడన్నది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. గతంలోనూ పృథ్వీ, పోసాని మధ్య ఇలాంటి మాటల యుద్ధం జరిగింది. అది మనసులో ఉంచుకుని పోసాని ఇలా పృథ్వీని ఆడేసుకున్నారా.. మరేదైనా కారణం ఉందా.. అన్నది తేలాల్సి ఉంది.