పోసాని కృష్ణ మురళి vs పృథ్వి రాజ్.. వీరికి ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండనే ఉంటుంది. మరి ఎందుకు పృథ్వి రాజ్ అంటే కోపమో.. ఎందుకు ప్రతిసారి అతన్నే టార్గెట్ చేస్తారో తెల్వదు కానీ.. చేసిన ప్రతిసారి అయన సంచలన వ్యాఖ్యలు చేస్తారు పోసాని కృష్ణ మురళి. ఇప్పటికే పృథ్వి రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గతంలోనే ఓసారి పృథ్వి మాటలకు కౌంటర్గా పోసాని మాట్లాడాడు. అప్పుడు పృథ్వి కూడా పోసానికి నాకు ఏం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఏకంగా పోసాని నీకు సిగ్గుందా పృథ్వి ? నువ్వు రేపు ప్రెస్మీట్లు పెట్టి మరీ క్షమాపణ చెప్పాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో పాటు అసలు నీకు అవగాహన లేదని... మంత్రులు పృథ్వికి సపోర్ట్ చేస్తే నేను తన దారి తాను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు..
పదవి కోసమా అని విలేకరులు ప్రశ్నిస్తే.. నేను అంత దిగజారను అని నాకు కావాలనుకుంటే నాకు గతంలోనే ఎమ్మెల్సీ, రాజ్యసభ ఆఫర్ చేశారని ప్రజారాజ్యంలో కూడా తనకు చిరు బ్రదర్సే పిలిచి సీటు ఇస్తే పోటిచేసి ఓడిపోయానని చెప్పారు. మరి కారణం ఏంటన్నది మాత్రం అంతుపట్టడం లేదు. పదవి ఇచ్చినందుకు తాను ఉక్రోషపడడం లేదని. విజయ్ చందర్ గారికి కూడా పదవి ఇచ్చారు కదా... ఆయన పెద్ద మనిషి కదా నాకు అలాంటిది ఉండదని పోసాని చెప్పారు.
ఏది ఏమైనప్పటికి పృథ్వి రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కడ పోసాని మురళి కృష్ణ. ప్రస్తుతం పోసాని మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.