నటుడు కమెడియన్ పోసాని మురళి కృష్ణకు ఈరోజు ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా అందరిని ఆడేసుకున్నాడు పోసాని మురళి కృష్ణ. అప్పటికే పృథ్వి రాజ్ పై పోసాని ధ్వజమెత్తరు. పృథ్వి మాటలకూ రాజధాని మహిళలు భాద పడి ఉంటారని పేర్కొన్న అయన వారికీ రేపు ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

గ‌తంలోనే ఓసారి పృథ్వి మాట‌ల‌కు కౌంట‌ర్‌గా పోసాని మాట్లాడాడు. అప్పుడు పృథ్వి కూడా పోసానికి నాకు ఏం లేద‌ని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఏకంగా పోసాని నీకు సిగ్గుందా పృథ్వి ? నువ్వు రేపు ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌డంతో పాటు అస‌లు నీకు అవ‌గాహ‌న లేద‌ని... మంత్రులు పృథ్వికి స‌పోర్ట్ చేస్తే నేను త‌న దారి తాను చూసుకుంటాన‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు..

 

ఈ నేపథ్యంలోనే అప్పటికే అందరి మీద ఫైర్ ఫైర్ ఉన్న పోసాని కృష్ణ మురళి మీడియాపై కూడా ధ్వజమెత్తారు. సినీ జీవితంలోకి వచ్చి 33 ఏళ్ళు అయ్యింది అన్న అయన.. అతనికి మీడియా ఎంతో సహాయం చేసింది అని.. అన్ని వేళల మీడియా ఆయనకు అండగా ఉందని చెప్తూ ఆంధ్రజ్యోతిపై అయన ఫైర్ అయ్యారు. 

 

మీడియా ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాలి.. కానీ ఇక్క‌డ ప్ర‌తిప‌క్షంతో మీడియా కుమ్మ‌క్కైంది.. అవాస్త‌వాలు రాస్తోంది.. త‌న‌ను హీనంగా చిత్రీక‌రించే మీడియానే టార్గెట్ చేస్తున్నారంటూ ఆంధ్ర‌జ్యోతిలో ఆర్కే రాసే కొత్త‌ప‌లుకును ఉద్దేశించి అదేంటి కొత్త ప‌లుకా.. చిల‌క ప‌లుకా ? అని సెటైర్ వేసిన‌ట్టుగా మాట్లాడారు. 

 

కొంద‌రు మీడియా వాళ్లు ఆర్కే ప‌లుకు అన‌గా ఆర్కే ప‌లుకా ? అని త‌న‌దైన స్టైల్లో వ్య‌గ్యంగా వ్యాఖ్యానించారు.. ఆలా ఆంధ్రజ్యోతి రాధా కృష్ణను కూడా కడిగిపారేశారు పోసాని కృష్ణ మురళి.. అతనిపై సెటైర్లు వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పోసాని కృష్ణ మురళి. దీంతో అయన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: