వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బినిమిలా భూముల కోసం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడు అని అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.               

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''వ్యవసాయం దండగ, ఉచిత కరెంటిస్తే వైర్లపై బట్టలు ఆరేసుకోవడం తప్ప సరఫరా ఉండదని హేళన చేశాడు. సహకార పాల సంఘాలన్నిటిని దెబ్బకొట్టి తన హెరిటేజ్ డెయిరీని డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు బినామీల భూముల కోసం రైతుల పేరుతో నాటకాలాడుతున్నాడు. వాటే విజన్ బాబ్జీ!'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.                               

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు... అతను నాటకాలు ఎవరికి తెలీదు సార్.. అందరికి తెలుసు.. రాజధాని రైతులకు కూడా ఈ చంద్రన్న నాటకాల గురించి తెలుసు సర్.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్విట్ కారణంగా ఒకరకంగా వైసీపీ టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరుగుతుంది. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: