ప్రస్తుతం హాట్ చర్చలు జరుగుతున్నాయి.. పోసాని మురళీ కృష్ణ, నటుడు పృధ్వీ రాజ్ మాటలు అందరిని ఆలోచన లో పడేశాయి.అందుకే వైసీపీ భాగోతం ఇదే నంటు చేసిన రచ్చ ప్రస్తుతం జనాల్లో అనేక ఆలోచన లు రేకెలా చేస్తున్నాయి..వివరాల్లోకి వెళితే.. జగన్‌ను అన్‌పాపులర్‌ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నారని  పోసాని మురళీ కృష్ణ మండిపడ్డారు. ఆయన తీరు పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పోసాని అన్నారు..ఇది ఇప్పుడు అన్నీ వర్గాల్లో చర్చ లు జరుగుతుంది..

 

ఆడ‌వాళ్ల గురించి ఎందుకు ఇలా మాట్లాడ‌తావ్‌...రైతుల గురించి ఎందుకు త‌ప్పు మాట్లాడ‌తావ్‌ రైతులు ఆత్మాభిమానం ఉన్న‌వాళ్లు... వాళ్ల‌ను ప‌ట్టుకుని మురికి కాల్వ‌ల్లో దిగేవాళ్లు... ఫెయిడ్ ఆర్టిస్టులు అంటావా .. సేమ్ పృథ్వి అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం నీ లాంటి వాళ్లు ఒళ్లు తిమ్మిరెక్కి మాట్లాడ‌డం వ‌ల్లే జ‌గ‌న్‌కు, వైసీపీ ప్ర‌భుత్వానిక అవ‌మానం అంటూ పోసాని ఫైర్ అయ్యారు..

 

ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి గాడు అని ఆడవాళ్లు తిడుతున్నారంటే.. అది పృథ్వీ లాంటి వాళ్ల వల్లేనని చెప్పారు. పృథ్వీ ఎవరి తరపున మాట్లాడారో చెప్పాలని పోసాని నిలదీశారు. పృథ్వీ వ్యాఖ్యలను మంత్రులు సమర్థిస్తే ఇక తాను మాట్లాడనని, తన దారి తాను చూసుకుంటాన ని పేర్కొన్నారు. పృథ్వీలాంటి సినిమా వాళ్లు మూడు, నాలుగేళ్లలో వచ్చి చేరారని చెప్పారు. 

 

తనతో పాటు ఎమ్మెల్యే రోజా పదేళ్ల నుంచి ఉన్నామని చెప్పుకొచ్చారు. రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని మరోసారి ప్రశ్నించారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కు ఎంత ఆవేదన ఉంటుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్‌ అంటే ద్వేషమని పోసాని కృష్ణ మురళి దుయ్యబట్టారు. ప్రస్తుతం వీరిద్దరి మద్య జరిగిన రాద్దాంతం సోషల్ మీడియా లో కూడా ట్రెండ్ అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: