ఆడపిల్లలకు ఆడపిల్లలే శత్రువులుగా మారుతున్నారా ?అనిపించేలా ఉన్న ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే, ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఒక ఆడపిల్లగా చేయకూడని పని చేసిన ఈ ట్యూషన్ టీచర్ దారుణం తెలుసుకుంటే, తల్లిదండ్రులు చివరికి పిల్లలను ట్యూషన్కు కూడా పంపడం మానేస్తారు. ఇకపోతే ఆడపిల్లల పై వేధింపులు వయస్సుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.
మంచిగా నాలుగు మాయమాటలు చెప్పి లోబరుచుకునే ఊసరవెళ్లుల్లా లోకంలోని మనుషుల మనుసులు మారిపోయాయి. అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తూ, నీచపు ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు సమాజం అని చెప్పుకునే ఇక్కడ మనుషులు కనిపించడం లేదు. అవయవాలతో వ్యాపారం చేసే కామాంధులు, కామాంధురాళ్లు కనిపిస్తున్నారు. ఇలా ఎందుకు అన్నాను అంటే. 19 ఏళ్ల వయస్సు ఉన్న యువతి ఎవడో బాయ్ ఫ్రెండ్ చెప్పాడని చేయకూడని పని చేసింది. ఆ వివరాలు తెలుసుకుంటే.
ఇండోర్కు చెందిన ఓ యువతి తన ఇంట్లోనే చిన్న పిల్లలకు, అంటే ఆరేళ్లు, అంతకంటే కొంచెం ఎక్కువ వయసున్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉంటుంది.. అయితే, అందులోని ఇద్దరు ఆడపిల్లలను సెలక్ట్ చేసుకున్న యువతి... వారి మర్మాంగాల్లో పెన్సిల్ పెట్టి ఆ ఘటనను వీడియో తీసేది. అలా తీసిన వీడియోలను తన బాయ్ ఫ్రెండ్కు పంపేదట.. ఈ రకంగా ట్యూషన్ పేరుతో రాక్షసంగా ఆమె ప్రవర్తించడం ఒకరోజు ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలిసిందట.
తల్లిదండ్రులు ఎందుకలా జరుగుతోందని అడగడంతో వారు తమ టీచర్ చేసిన నిర్వాకం గురించి మొత్తం చెప్పారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో యువతి చెప్పే ట్యూషన్కు వద్ద వెళ్లి అక్కడే ఆ ట్యూషన్ టీచర్ను పట్టుకుని గట్టిగా నాలుగు తగిలించే సరికి, ఇదంతా తాను తన బాయ్ ఫ్రెండ్ అడగడంతో, చేసినట్టు ఆమె ఒప్పుకుందట. ఆ తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేసారట పోలీసులు..