ఎప్పటికప్పుడు చంద్రబాబుని.. పచ్చ టీమ్ ని ఏకిపారేస్తుంటారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి.. వైసీపీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బినామీలు.. అనుచర వర్గం ఆస్తులే లక్ష కోట్ల పైన ఉన్నాయి.. వెయ్యి కోట్లు పోగు చేసేవాళ్ళు మీరు.. అలాంటి మీరు జోలె పట్టి అడుక్కోవడం ఏంటి చంద్రబాబు ? తుపాకులతో సాయుధ పోరాటం కానీ మొదలు పెట్టారా ఏంటి ? అంటూ సంచలన ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్ చేస్తూ.. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయి. గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటి చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?'' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు చంద్రబాబుపై మండిపడుతున్నారు.. ఇంకా ఎందుకు ఆ పచ్చవాళ్ళని చూస్తున్నారు.. జైల్లో వేసి పారేయండి.. అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. ఈ ట్విట్ తో వైసీపీ అభిమానుల మధ్య టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. దీంతో విజయసాయి రెడ్డి ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి ఈ ట్విట్ కు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: