రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.  కొందరు నాయకులను... కొన్ని గ్రామాల ప్రజలను వెంటబెట్టుకుని ఆస్తులు కాపాడుకోవడం కోసం అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు. జిల్లాలు పట్టుకుని తిరుగుతున్న బాబుని, ఒకే ఒక్క ప్రకటనతో  సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో లాక్ చేశారన్నవ్యాఖ్యలు రచ్చబండపై వినిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమం రాష్ట్ర స్థాయిలో జరుగుతోందని కలలుగన్న చంద్రబాబుకు బ్రమగా మిగిలిపోతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే కనీసం ఆ 29 గ్రామాల ప్రజలు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారా అంటే, అదీ అనుమానమే. నిజమైన రైతులు, తమకు ప్రభుత్వం భరోసా ఇస్తే ఈ గొడవని ఇక్కడితో ఆపేసేలా ఉన్నారు. వారికి జగన్ నుంచి హామీ లభిస్తే.. అమరావతి ఉద్యమం కాస్తా, చంద్రబాబు ఉద్యమంలా మారిపోతుందనేది వాస్తవం. మొత్తమ్మీద ఢిల్లీ పేరు చెప్పుకునే చంద్రబాబుని ఓ పద్ధతి ప్రకారం గల్లీ స్థాయికి తీసు కొచ్చారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. మొత్తమ్మీద తాను ఎవరి కోసం, ఏ స్థాయి పోరాటం చేస్తున్నారో... తెలియకుండానే చంద్రబాబు ఓ చక్రబంధం చిక్కకున్నారు.

సీఎం జగన్ చేసిన మూడు రాజధానులు ప్రకటనలో ఇరుక్కుపోయి.. దాని చుట్టూ గింగరాలు తిరుగుతున్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ఢిల్లీ స్థాయిలో ఎత్తుకు పైఎత్తులు వేసే బాబోరు రాజధాని ప్రాంతానికి పరిమితమైపోయారు. ఒక రకంగా ఇది జగన్ వ్యూహాత్మక ఎత్తుగడే. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున రాజధానుల పై జగన్ ప్రకటన చేయడం, ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ రిపోర్ట్, వెను వెంటనే బోస్టన్ కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ అంటూ మరో అంకానికి తెరలేవడం.. ఎక్కడా గ్యాప్ లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. దీనికి తోడు మరో వారంలో హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికలో కనీసం ఆలోచించుకునే అవకాశం లేకుండా బాబుని ఇరుకున పెట్టినట్టైంది.

జగన్ ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు గ్రామస్థాయి రాజకీయాలకు పరిమితమైపోయారు. అమరావతి రైతుల బాధ, కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైంది ఈ విషయాన్ని ఓ వర్గం మీడియా హైలెట్ చేస్తుంది కానీ, మిగతా జిల్లాల ప్రజలు దీనిపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదనేది ఎంత వాస్తవమో అదే తీరులో అమరావతి మినహా జిల్లాల టీడీపీ నేతలు కూడా తమకెలాంటి సంబంధం లేదన్నట్టు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడంతో అటు ప్రజలకీ, ఇటు టిడిపి పార్టీ నాయకులతో సహా చంద్రబాబు ను దూరం చేశారన్న వాదన బలంగా వినిపిస్తుంది.  మొత్తానికి చంద్రబాబును అమరావతి చుట్టూ తిరిగేలా జగన్ అష్టదిగ్బంధం చేశారని అంటున్నారు. 

ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డ బడా నాయకులు, మీడియా అధినేతలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. కేవలం రైతుల్ని, స్థానికుల్ని అడ్డం పెట్టుకుని ఓ బోగస్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనే విమర్శలు. ఇది కూడా ఎక్కువ రోజులు సాగేలా కనిపించడం గ్రహించిన వైసీపీ నాయకులు, మంత్రులు రైతులను చర్చలకు ఆహ్వానించడంతో వారిలో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: