పోసాని కృష్ణ మురలి - పృథ్వీ ల మధ్య వైకాపా వాళ్ళే ఐనా కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వీరిద్దరూ ఎందుకు గొడవ పడతారో దేనికోసం గొడవ పడుతున్నారో కూడా అర్ధం కాకుండా కొట్టుకుంటున్నారు. రీసెంట్ గా అమరావతి రైతులని పృథ్వీ పైడ్ ఆర్టిస్ట్ లు అన్నాడు అని కోపం తో రగిలిపోయారు పోసాని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు .. ‘రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా?, బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా?’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వ్యాఖ్యలను పోసాని ఖండించారు.

 

 

రైతులకు కార్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. " సిగ్గు పడాలి పృథ్వీ నువ్వు " అంటూ తీవ్ర పదజాలం తో సీరియస్ అయ్యారు పోసాని .. " పదేళ్లుగా జగన్ నాకు తెలుసు .. కులాలకీ మతాల గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు .. జగన్ ని నేను గౌరవిస్తూనే ఉన్నా అంటే అదే కారణం " అని చెప్పుకొచ్చారు పోసాని .. దానికి రిప్లయ్ ఇచ్చారు పృథ్వీ .. "పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. పార్టీ స్టాండ్ ప్రకారమే నేను మాట్లాడాను.

 

 

నా వల్ల పార్టీ నష్టపోతోందని.. తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు." అన్నారు పృథ్వీ .. ఎవరెవరో మాట్లాడితే నేను సమాధానం చెప్పాను అంటూ పృథ్వీ కూడా కాస్త ఘాటు గానే సమాధానం చెప్పారు. ఇలా ఇద్దరి మధ్యనా గొడవ , వాదోపవాదాలు జరుగుతూ ఉండడం తో ఈ వ్యవహారం జగన్ దగ్గరకి వెళ్లింది అనీ ఇద్దరికీ జగన్ క్లాస్ పీకబోతున్నారు అని తెలుస్తోంది. జనాల గురించి ఆలోచించడం మానేసి మనలో మనమే కొట్టుకుంటే ఎలా అనేది జగన్ వాదన . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: