నిర్భయ.. ఈ ఘటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. 9 గంటల సమయంలో అమ్మాయి బస్సు ఎక్కితే 11 గంటలకు కారుతున్న రక్తంతో నగ్నంగా నడిరోడ్డుపై ఆ యువతీ పడింది. అది కూడా 5 పర్సెంట్ పేగులతో. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యంలో తప్పు లేదు. ఎందుకంటే... అంత దారుణమైన ఘటన అది. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. 2012 డిసెంబర్ 16.. చలికాలం అది. ఆ సమయంలో ఓ యువతీ, యువకుడు ప్రైవేట్ బస్సు ఎక్కారు. 

 

ఆ బస్సులో డ్రైవర్ తో సహా కేవలం ఆరుమంది ఉన్నారు. అంతే.. కొద్దీ సమయానికి ఆ ఆరుమందిలో ఒకరు వచ్చి.. ఎందుకు ఇంతవరుకు బయట ఉన్నావ్ అంటూ అమ్మాయిపై చెయ్యి వేశాడు. అనంతరం ఆమె తిట్టడంతో కోపంతో ఊగిపోయిన వారు ఆమెని, ఆమె స్నేహితుడును ఇనుప రాడ్ తో కొట్టారు. అత్యాచారణానికి సహకరించమని ఆమెకు ఎంత చెప్పిన వినకపోయేసరికి పక్కనే ఉన్న రాడ్ తో కొట్టారు. దారుణంగా ఆ ఆరుమంది ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అయినప్పటికీ వారికీ ఇంకా కసి తిరక ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్ పెట్టి దాదాపు 95 శాతం పేగులను బయటకు తీశారు ఆ నీచులు. 

 

ఈ ఘటన జరిగిన 14 రోజులకు నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించింది. అయితే అప్పట్లో ఈ కేసుపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనలకు ఫలితంగా ఆ నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ నీచులలో ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. మరొకరు టీనేజర్ అని ఉరి నుండి తప్పించుకున్నాడు. అయితే మిగితా నాలుగురు గత 8 ఏళ్ళ నుండి పందులు మేసినట్టు జైల్లో మేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిందితులకు ఉరి శిక్ష ఖరారైంది. వారు చచ్చేవరుకూ ఉరి తియ్యాలని కోర్టు స్పష్టం చేసింది.  

 

దీంతో.. ఇంకా సరిగ్గా 10 రోజులకు నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలు చెయ్యనున్నారు. జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తియ్యనున్నారు. దీంతో నిర్భయ నిందితులు వెక్కి వెక్కి ఏడ్చారట. అయితే.. మన భారత చట్టం ప్రకారం నిందితుడు ఎంత కిరాతకుడు అయినా సరే.. ఉరి శిక్ష అమలు చేసే ముందు వారికీ చివరి కోరిక అడిగి తెలుసుకొని అది తీర్చి ఉరి శిక్ష వేస్తారు. 

 

ఈ నేపథ్యంలోనే నిర్భయ నిందితులు అయినా ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ లకు కూడా చివరి కోరిక ఏంటి అని అడిగారట. ఆ నలుగురు ఓ షాకింగ్ కోరిక కోరారట. అదేంటంటే.. వారికి చివరి కోరిక కేవలం వారి కుటుంబంతో ఓ రెండు గంటలు మాట్లాడే అవకాశం కల్పించాలి అని ఆ నలుగురు నిందితులు కోరారట. దీంతో జైలు అది అధికారులు కూడా సరే అని చెప్పారని సమాచారం. 

 

అయితే నిర్భయ నిందితుల చివరి కోరిక ఏంటి ఇంత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది అని కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. మరి కొందరు.. నిర్భయని చంపే ముందు మీరు ఆమె చివరి కోరిక అడిగారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు ఏం అంటారు ఈ చివరి కోరిక గురించి ?

మరింత సమాచారం తెలుసుకోండి: