టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎప్పుడు అధికార వైసిపి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు పై ఎవరైనా విమర్శలు చేస్తే దానికి బదులుగా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఇక తాజాగా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిల్లర సలహాలు ఇచ్చే ముఖ్య సలహాదారుడు మిరే కదా అంటూ వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎద్దేవా చేశారు బుద్ధ వెంకన్న. తండ్రి శవాన్ని కూడా చూడకుండానే సంతకాలు పెట్టమని జోలె పట్టి అడుక్కునే సలహా ఇచ్చింది కూడా మిరే  కదా అంటూ విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు బుద్ధ వెంకన్న. 

 

 

 పెద్ద రోగం తో పోయిన వ్యక్తిని కూడా మా మహానేత కోసమే పోయాడు  అంటూ బిల్డప్ యాత్ర సలహా ఇచ్చింది కూడా మీరే కదా అంటూ విజయసాయి రెడ్డి ని విమర్శించారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా సబ్బుతో స్నానం చేయించి ముద్దులు ఇవ్వడం... పచ్చని పొలాలను రైళ్ళను తగలబెట్టి మొసలికన్నీరు కార్చడం.. డ్రామా కంపెనీలను తలపించేలా యాక్షన్ సీన్లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి అన్ని చెత్త పనులకు మీరే కదా డైరెక్టర్ విజయ సాయి రెడ్డి అంటూ బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఒక్కటే. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయం. జగన్ 3 రాజధానిల నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపడుతున్న నిరసనలు గత 20 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రైతుల నిరసన కు మద్దతు తెలుపుతున్న టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పరిరక్షణ సమితి తో విరాళాలు సైతం సేకరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుండి మరి రైతుల ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: