ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి నారా లోకేష్ పై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.   

 

ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను కడిగి పారేసే విజయసాయి రెడ్డి ఈరోజు నారా లోకేష్ చంద్రబాబుపై కూడా దారుణంగా కామెంట్లు చేస్తూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ముఖ్య సలహాదారుడు చిట్టినాయుడే అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''చంద్రబాబు నాయుడుకు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల’ కథను గుర్తు కొస్తోంది. తుఫాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?'' అంటూ సంచలన ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. చంద్రబాబు, నారా లోకేష్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: