పై హెడ్డింగ్ చదివితే మీరు చదివింది నిజమా కదా అనే సందేహం వచ్చేసిందా ? అవును ఇది చదివితే ఎవరికైనా ఆ సందేహం వచ్చి తీరాల్సిందే. బాలయ్య ఏంటి వైసీపీలో చేరడం ఏంటి ? ఆయన స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు + బావమరిది = లోకేష్ కు పిల్లనిచ్చిన మావయ్య. ఇక టీడీపీలో బాలయ్య హవాకు అడ్డేముంది ? అసలు బాలయ్య పార్టీ మారాల్సిన అవసరం వస్తుందా ? అవసరమైతే రాజకీయాలకు దూరం అవుతురు తప్ప ఇలా పార్టీ మారే ఛాన్స్ లేదు కదా అనేది అందరికి వచ్చే సందేహమే. అయితే వైసీపీ నాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాత్రం బాలయ్య వైసీపీలోకి వచ్చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకోవాలని తమ అధినేత జగన్ భావిస్తే టీడీపీ లో లోకేష్, చంద్రబాబు తప్ప మిగతా అందరూ వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ కూడా వైసీపీలో చేరుతారని ఈ సంద్రాభంగా ఆయన వ్యాఖ్యానించారు.  గతంలో బాలయ్య మీదున్న కేసులు మళ్లీ బయటకి తీస్తే అందరికంటే ముందుగా బాలయ్య తమ పార్టీలోకి వచ్చేందుకు వెనకాడరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 


హైదరాబాద్ లోని బాలయ్య నివాసంలో గతంలో జరిగిన కాల్పుల కేసు మళ్లీ బయటకు కనుక తీయిస్తే వెంటనే వచ్చేస్తారని, అసలు ఆ కాల్పుల కేసు నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయ దాక్షణ్యాలతో బాలయ్య బయటపడ్డాడు అంటూ నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు  చేసింది ఏమీ లేదని, అయినా ఆయన ఏదో చేసేసాను అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీని మరింత ముందుకు తీసుకువెళ్లి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: