వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కనీసం సంక్రాంతి పండుగను కూడా సంతోషంగా చేసుకొనిచ్చేలా లేడు కర్మ అంటూ ట్విట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే... 

 

విజయసాయి రెడ్డి అమరావతి నిరసనలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తు.. అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయి. ఇన్ సైడర్ భూముల కోసం చంద్రబాబు జోలె పట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తుండటం అందరికీ చికాకు తెప్పిస్తోంది. పండగ కూడా ప్రశాంతంగా చేసుకోనిచ్చేలా లేడని విసుక్కుంటున్నారు." అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏం చేస్తాం సర్.. యువకుడి చేతిలో ఓడిపోయినందుకు అవమానంగా ఫీల్ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అంటూ సంచలన ట్విట్ చేశారు నెటిజన్లు. ఈ ట్విట్ కు ఎంతోమంది నెటిజన్లు సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ట్విట్ అటు వైసీపీ అభిమానులను.. ఇటు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: