ఇటీవల కొద్దిరోజులుగా మనిషి మనుగడ పరిస్థితులు గమనిస్తుంటే రాను రాను డబ్బుకోసం కొందరు ఎంతకైనా తెగించే పరిస్థితికి వచ్చేసారు. ఒకప్పుడు మనలో ఎక్కువమంది కొన్ని రకాల తప్పులు చేయాలంటే ఒకింత ఆలోచించేవారు. అయితే రాను రాను ప్రతి ఒక్క అవసరానికి డబ్బు యొక్క ప్రాధాన్యం తప్పనిసరి అవడంతో కొందరు డబ్బు కోసం ఎటువంటి దారుణాన్నైనా చేయడానికి సిద్ధం అవుతున్నారని, ఇటువంటి పరిస్థితుల వలన రాబోయే కాలంలో మరిన్ని అకృత్యాలు జరిగే అవకాశం ఉందని మానసిక నిప్పులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, కొందరు ముఠా సభ్యులు ఏకంగా ఒక ఆర్మీ మేజర్ ఇంట్లోనే తమ సెక్స్ దుకాణాన్ని తెరిచారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తర్ ప్రదేశ్ లోని మానవ అక్రమ రవాణా విభాగం అధికారులు, అక్కడి మీరట్ ప్రాంతంలోకి ఒక ఇంట్లో సోదాలు చేయగా భారీగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అయితే అది ఒక ఆర్మీ జవాన్ ఇల్లు కావడంతో అక్కడికి తనిఖీకి పొలిసు వంటి వారు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని భావించిన ఒక ముఠా, దానిని అద్దెకు తీసుకుని తమ తప్పుడు పనులకు అడ్డాగా మార్చుకుంది. కొద్దిరోజులుగా ఆ విధంగా తప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో, చుట్టుప్రక్కల ఉండే కొందరికి ఆ ఇంటికి వస్తున్న వారిపై అనుమానం కలిగి గట్టిగా నిఘా వేయగా విషయం వెలుగులోకి వచ్చింది. 

 

అయితే ఈ విషయాన్ని  స్థానికులు, అక్కడి అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సహా మనుషుల రవాణా అధికారులు కూడా అక్కడికి చేరుకుని కొందరు విటులు, అమ్మాయిలను స్పాట్ లోనే పట్టుకుని అరెస్ట్ చేసారు. ఢిల్లీ, పూణే నుండి కొందరు అమ్మాయిలను ఇక్కడికి పిలిపించి సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసిందని, అతి త్వరలో పూర్తి వివరాలు విచారణలో రాబడతాం అని పోలీసులు అంటున్నారు. అయితే ఇంత తెలివిగా ఆర్మీ జవాన్ ఇంటిని తమ వ్యభిచార గృహంగా మర్చి తప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు ప్రజలు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: