సినీ నటుడు మరియు వైఎస్సార్సీపి నాయకుడైన పృథ్వీరాజ్ జగన్ పార్టీలో చేరి గట్టిగా ఒక సంవత్సరం రోజులు అయిందేమో... అప్పుడే తన ఎస్విబిసి చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తన ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో అతను ఫోన్ లో రొమాన్స్ చేసిన కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో అతనిపై వేటు పడింది. మొన్నటి రాత్రి నుండి ఏ యూట్యూబ్ ఛానల్ లో చూసినా... సోషల్ మీడియాలో ఏ పోస్ట్ లో చదివినా... ఏ మీమ్ కంటపడినా అన్నింటా పృథ్వీరాజే.

 

అయితే ముందుగా టీటీడీ చైర్మన్ పృథ్వీరాజ్ ను తన పదవికి రాజీనామా చేయమని ఆదేశిస్తే ఆయన తన వివరణ వినుమని అడిగారు. అయితే తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని వెంటనే పృథ్వి ని పదవికి రాజీనామా చేయమని ఆదేశించడంతో వేరే గత్యంతరం లేక పృథ్వీరాజ్ తన రాజీనామాను బోర్డు వారికి అందజేశారు. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ కి వచ్చిన పృథ్వి అక్కడ తన ఆక్రోశాన్ని పూర్తిగా వెళ్లగక్కాడు.

 

తనకు దక్కిన ఎస్వీబీసీ చైర్మన్ పదవిని చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ వారు తనపై కుట్ర పన్ని ఈ అబద్ధపు ఆడియో టేప్ ను సృష్టించారని ఆయన అన్నారు. ఆడియోలో ఉన్న వాయిస్... తన ఉద్యోగినితో "నీతో కలిసి మందు తాగుతా" అని చెప్పగా.... పృథ్వి మాత్రం తనకు అసలు తాగుడు అలవాటు లేదని చెప్పడం ఆశ్చర్యకరం. అంతటితో ఆగకుండా తన కాలుకి ఉన్న చెప్పు ని తీసి టేబుల్ పైన పెట్టి నాకు ఏ డాక్టర్ ను అయినా తీసుకొని వచ్చి రక్త పరీక్ష చేయించండి లేదా నేను నిజం చెప్తున్నది నిజమా లేదా అని మీకు నచ్చిన టెస్ట్ చేయించుకోండి.... నేను తప్పు చేశాను అని తెలిస్తే ఇదే చెప్పుతో కొట్టండి అని చెప్పు ని అందరికీ చూపించాడు.

 

ప్రస్తుతం అతని ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తుండగా ఇంకా దీనికి సంబంధించిన నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: