ప్రస్తుత కాలంలో ప్రతి వారు చాలా బిజీగా ఉంటున్నారు. ఆశ్చర్య పోకండి. బిజీగా ఉంటున్నది సంపాదనలో కాదు. మరి దేనిలో అనుకుంటున్నారా సెల్ ఫోన్లో, చాటింగ్ చేస్తూ, మాట్లాడూతూ, పనికి రాని వీడియోలు చూస్తూ, గేంస్ ఆడుతూ ఇలా కాలాన్ని అగ్గిపుల్లలా కాల్చేస్తున్నారు. కానీ దీని వల్ల వచ్చే సమస్యలను మాత్రం ఆలోచించలేక పోతున్నారు. ఇకపోతే ఈ కాలంలో ప్రతి మనిషికి సెల్ ఫోన్ అనేది శరీరంలో ఒక అవయవంలా మారిపోయింది. ఇప్పుడు పరిస్దితి ఎలా ఉందంటే చెయ్యి, కాలు లేకపోతే ఎలా కుమిలిపోతామో సెల్ ఫోన్ లేక పొతే అంతకంటే ఎక్కువగా బెంగ పెట్టేసుకుని మంచం ఎక్కేలా తయారు అయ్యారు..

 

 

సరదాకి ఈ ఫోన్ అలవాటు చేస్తుకుంటే అది చివరికి కొంపలు ముంచేలా తయారు అవుతుంది.. ఇక సెల్ ఫోన్ మాట్లాడుతూ కొండపై నుంచీ పడిపోయి చనిపోయిన వాళ్ళు కొంతమందైతే,  తప్పుడు మార్గాలలో పయనిస్తూ మరి కొంతమంది క్రిమినల్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా ఈ రకమైన ధోరణి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్న తల్లి తండ్రులు ప్రస్తుతం ఈ ఫోన్ ని బ్యాన్ చేసేస్తే బాగుండు అనే పరిస్థతికి వచ్చేశారు…  ఇదిగో ఇలాంటి ఆలోచననే అమెరికాలోని వెర్మంట్ రాష్ట్రం అమలు చేయాలని నిర్ణయించింది.

 

 

తమ రాష్ట్రంలో ఎంతో మంది యువత చెడు మార్గాలలో పయనించడానికి ప్రధానమైన కారణం సెల్ ఫోన్ అని సర్వే చేయించుకుని మరీ నిర్ధారించుకున్న జాన్ రోడ్జర్స్ అనే  సెనేటర్ ఈ పరిస్థతిని మార్చాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎస్.212 అనే పేరుతో ఓ బిల్లు ప్రవేశ పెట్టారు. అందులో ఉన్న అంశం ఏంటంటే. యువత ఎవరైనా సరే వారు వయస్సు 21 సంవత్సరాలు దాటేవరకు స్మార్ట్ ఫోన్ వాడితే ఇకపై కటకటాల వెనక్కి నెట్టడమే కాదు, 70 వేల రూపాయల ఫైన్ తో పోటు, వారు కఠినమైన జైలు జీవితం కూడా అనుభవించాల్సి వస్తుందని తెలిపారు.

 

 

ఈ బిల్లు ప్రవేశపెట్టగానే ఒక్కసారిగా సభ మొత్తం హర్ష ద్వానాలతో మారుమోగింది. అందరూ ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. అయితే ఈ బిల్లుని కొందరు వ్యతిరేకిస్తున్నా మెజారిటీ ప్రజలు ఈ బిల్లుని స్వాగతిస్తున్నారు. ఇక ఒకరకంగా ఈ మార్పు మంచిదే అని అనుకోక తప్పదు. ఇలాంటి చట్టం కూడా మన ఇండియాలో అమలైతే ఎంత బాగుండుదో.

మరింత సమాచారం తెలుసుకోండి: