జబర్దస్త్ షో లో  జడ్జిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే... మరోవైపు నగరి ఎమ్మెల్యే గా ఏపీఐఐసీ చైర్మన్ గా .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే రోజా. జబర్దస్త్ లో తనదైన స్టైల్ లో జడ్జిమెంట్ ఇస్తూ తన నవ్వులతో.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రోజా.. ప్రతిపక్షాలపై ఘాటుగా విమర్శలు చేస్తూ రాజకీయాల్లో కూడా ఓ పవర్ ఫుల్ వ్యక్తిగా కొనసాగుతున్నారు. వైపు బుల్లితెరను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారి హృదయాలను గెలుచుకున్న రోజా... జబర్దస్త్ షోలో నవ్వుల పువ్వులు పూయించి తనదైన స్టైల్లో జబర్దస్త్ షో ని ముందుండి నడిపిస్తుంది. 

 

 

 ఒకవైపు నగరి ఎమ్మెల్యే ఇక మరోవైపు ఏపీఐఐసీ చైర్మన్గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంక్రాంతి వస్తే చాలు సొంత నియోజకవర్గం నగరి  కి వెళ్ళిపోతారు రోజా. సంక్రాంతి పండుగ మూడు రోజులు అక్కడే ఉండి పోతారు. ఇక ఈ సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సంక్రాంతి కావడంతో... వైసిపి నేతల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు అందరూ సంక్రాంతి పండుగను మరింత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక రోజా కూడా ముందుగానే నగరి  కి వెళ్ళిపోయారు. నగరి నియోజకవర్గంలోని ప్రజలందరి మధ్య సంక్రాంతి పండుగ జరుపుకుంటూ తెగ సందడి చేసేస్తున్నారు. 

 

 

 సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు ఎమ్మెల్యే రోజా. అంతేకాకుండా ఎద్దుల బండి ని ఆమె స్వయంగా తోలారు. పిల్లలకు భోగిపళ్లు పోసారు. కుటుంబ సమేతంగా నియోజకవర్గ ప్రజల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే రోజా. ఇక తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకోవడం ఇంకా స్పెషల్ గా ఉందని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. వైసీపీ అభిమానులతో పాటు రోజా అభిమానులు కూడా ఈ ఫోటోలను షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలందరికీ ఫోటోలు తెగ ఆకర్షిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: