మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మంచి వాళ్ళ ముసుకు వేసుకొని సమయం కోసం ఎదురు చూసే మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలతో మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కామపు కోరల్లో చిక్కుకుని బలైపోతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారిని శిక్షించేందుకు ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ చాలామందిలో మాత్రం మార్పు రావడంలేదు. అత్యాచారాలు చెయ్యడానికి వెనుకడుగు వేయడం లేదు. మొన్నటికి మొన్న దిశా  అత్యాచారం హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పటికీ కూడా మంచి వాళ్ళ ముసుగులో  అత్యాచారాలకు పాల్పడుతున్నారు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్ళు . 

 

 

 తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ముంబై నగరంలోని ఖర్  ప్రాంతానికి చెందిన అజ్మల్  హుస్సేన్ లష్కర్ అనే 26 ఏళ్ల యువకుడికి... ఓ కార్యక్రమంలో మహిళా పరిచయమైంది. ఇక కొంచెం కొంచెం గా పరిచయం పెంచుకునే పెళ్లి చేసుకుంటానని ఆ మహిళలను  నమ్మించాడు ఆ యువకుడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ యువకుడి కన్ను ఆమె మేనకోడలు పై పడింది. మహిళ మేనకోడలు ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. మేనకోడలు పై  కూడా అత్యాచారం చేశాడు. ఇద్దరు పై అత్యాచారం చేసిన సమయంలో అత్యాచారం చేసిన ఈ సంఘటనను మొబైల్ ద్వారా రికార్డు చేసాడు. 

 

 

 ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడటం  మొదలుపెట్టాడు. ఆ వీడియో చూపించి బాలికపై పలుమార్లు దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. దీంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో గర్భందాల్చిన బాలిక కుటుంబ సభ్యులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో నిందితుడైన అజ్మల్ హుస్సేన్ పౌ  ఐపీసీ సెక్షన్ 376,  506 సెక్షన్ 4, 8, 12 ప్రకారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతన్ని కస్టడీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: