మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని సంక్రాంతి బిచ్చగాడి గెటప్ వేసిన చంద్రబాబు చూస్తున్నారని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైపవర్ కమిటీ సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిపై, చంద్రబాబు తనయుడు లోకేష్ పై కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. 
 
అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ భావనలు గట్టిగా ఉండటం వలనే చంద్రబాబు నాయుడికి ఈ విషయం బోధపడటం లేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడని అందువలనే చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయి అమరావతికి వచ్చాడని చెప్పారు. 
 
చంద్రబాబు చేసిన పాపాలకు చివరకు అడుక్కుతినే పరిస్థితికి వచ్చారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు సంక్రాంతికి బిచ్చగాడి వేషం వేసి అడుక్కుంటున్నారని కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 60 లక్షల మంది తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం తీసుకున్నారని కానీ తెలుగుదేశం పార్టీ సమావేశాలకు మాత్రం 500 మంది కూడా రావడం లేదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 
 
చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయాడని సీఎం జగన్ దెబ్బకు ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు ఇలా మారిపోయాడని అన్నారు. చంద్రబాబు తనకు నిత్యం రక్షణ ఇచ్చే పోలీసుల గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రాంతం ప్రజల యొక్క అభిప్రాయాలను హై పవర్ కమిటీకి తెలియజేశానని కొడాలి నాని అన్నారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధాని తరలింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారని తెలుస్తోంది. 20వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఎమ్మెల్యేలకు సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: