ఈ మద్య దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతున్నాయి.  ఇటీవల తెలంగాణలో దిశ కేసు విషయంలో జరిగిన ఘోరం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మాయమాటలు చెప్పి నలుగురు కామాంధులు వెటర్నరీ డాక్టర్ దిశను బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకు వెళ్లి బలవంతంగా మద్యం తాగించి కృరమృగాళ్లా ఆమెను అత్యాచారం చేసి చివరికి దహనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.  ఆ కామాంధులను బహిరంగంగా ఉరితీయాలని.. ఎన్ కౌంటర్ చేయాలని దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసన వెల్లువెత్తింది.  అయితే కేసు విచారణ సందర్భంగా నలుగురు పోలీసులపై తిరగబడటం.. దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసలు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందన అధికారుల తెలిపారు.  

 

దాంతో దేశ వ్యాప్తంగా పోలీసులపై హర్షాతిరేకలు వెల్లువెత్తాయి.  ఓ వైపు ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పపడుతుంటే.. మరోవైపు కొంత మంది ఆడవాళ్లు మగవాళ్లను దారుణంగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఓ యువకుడు తన పేరు మార్చుకొని ఇద్దరు ఆడవాళ్లను ఘోరంగా మోసం చేశాడు.  మహారాష్ట్రలో  అసోం రాష్ట్రానికి చెందిన అజ్మల్ లష్కర్ అనే యువకుడు ఓ మహిళ (23) జాతరలో చూసి తన పేరు ఆశిష్ దుబేగా పరిచయం చేసుకున్నాడు.  ఆ తర్వాత ఆమెతో మాటా మాటా కలిపి ముగ్గులోకి దింపాడు. తాను ప్రేమిస్తున్నాని.. పెళ్లి చేసుకుంటానని మోసి చేసి లోబర్చుకున్నాడు.

 

ఆ సమయంలో ఆమె నగ్నంగా ఫోటోలు.. వీడియో తీశాడు. ఆ తర్వాత ఆమె కోడలు (17) కి చూపించి తనతో శృంగారం చేయకుంటే మీ అత్త ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాని బెదిరించి అత్యాచారం చేశాడు.  దాంతో ఆ బాలికకు గర్భం వచ్చింది. అనంతరం ఆ యువకుడు పరారయ్యాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  కాగా, నింధితుడు ముంబాయిలో పట్టుబడ్డాడు.. అజ్మల్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 17 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: