వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యే విజయసాయి రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఇన్ సైడర్ కిరికిరిలో దొరికిపోయి ఈసారి పండగ బహిష్కరిస్తున్నాడట అంటూ ఘాటు ట్విట్ చేశారు..                                

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపుకునే సంప్రదాయం తమ కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచించాడు. ‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయి ఈసారి పండగ బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది.'' అంటూ ట్విట్ చేశారు.                          

 

ఈ ట్విట్లు చుసిన నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడ్డారు.. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానులు.. టీడీపీ అభిమానుల మధ్య మాటల యుద్ధం చేసుకొని ఈ ట్విట్ ని మరింత వైరల్ చేశారు. ఏది ఏమైనా చంద్రబాబు చాల చాల శ్రమిస్తున్నాడు తన భూముల కోసం అంటూ మరికొందరు ట్విట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: