రాష్ట్ర మహిళాకమిషన్‌ చైర్మన్‌ రెడ్డిపద్మచేసిన కామెడీషో చూసినవారంతా సిగ్గుతో తలవంచుకుంటున్నారని, ఎక్కడా కనీవినీ ఎరుగనివిధంగా, దేశంలో ఎవరికీ పట్టని విధంగా రాష్ట్రానికి దుర్గతిపడితే, రాష్ట్రమహిళగా ఆమె స్పందించినతీరు దారుణమని   టీడీపీ మహిళానేత, పార్టీ అధికారప్రతినిధి దివ్యవాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌ప్రభుత్వం వచ్చాక రాష్ట్రమహిళలకు కన్నీళ్లే మిగిలాయని, వారివేదనగురించి పట్టించుకోకుండా, అహంకారపూరితధోరణితో మాట్లా డటం ఆమెకే చెల్లిందని దివ్యవాణి మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలవల్లే జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్రపర్యటనకు వచ్చిందన్న సంగతి మరిచి, పద్మ మాట్లాడుతోందన్నా రు. 

 


ప్రభుత్వంలో న్యాయముంటే, జాతీయ మహిళాకమిషన్‌ సభ్యులను కలవనీయకు ండా, రాజధాని మహిళల్ని ఎందుకు అడ్డగించారన్నారు. ప్రతిపక్షసభ్యులుగా టీడీపీ మహిళానేతలు జే.ఏ.సీని కలుపుకొని పోరాటం చేస్తుంటే, దాన్నెందుకు ఓర్వలేకపోతున్నా రని దివ్యవాణి ప్రశ్నించారు. రాష్ట్రమహిళాకమిషన్‌ పదవిలో ఉండి, రాష్ట్రమహిళల మధ్యకురాలేని దుస్థితిలో ఉన్నందుకు పద్మ సిగ్గుపడాలన్నారు. ఆయుష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాటిమహిళను కూడా పరామర్శించే ధైర్యం ఆమెకు లేదన్నారు.  


 నేను విన్నాను.. అన్నాను..కన్నానని ఓట్లు అడుక్కున్నవారంతా, రక్షకభటులసాయంతో  రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకొని రైతులు, మహిళల్ని నక్సలైట్లలా, డెకాయిట్లలా, టెర్రరిస్టు ల్లా చూస్తున్నారన్నారు. ప్రశాంతంగా నిరసనతెలుపుతున్న వారిపై 144సెక్షన్‌పేరుతో   అమానుషానికి పాల్పడ్డారని, రాష్ట్రంలోని మహిళలంతా రుద్రమదేవిలా, మగువ మాంచాలలా పోరాడే సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వమిచ్చే బిస్కట్లకోసం ఉద్యోగులు , ప్రజలు ఆశపడే పరిస్థితిలో లేరన్నారు. జగనన్న బాణాన్ని అనిచెప్పి ఓట్లు అడుక్కున్న ది ఎవరో, ఆనాడు రాజన్నబిడ్డనంటూ రాష్ట్రంలో తిరిగిందెవరో పద్మకు తెలియదా అని దివ్యవాణి ప్రశ్నించారు. నోరుందికదా అని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, ప్రజలంతా  తగినవిధంగా బుద్ధిచెప్పడం తథ్యమన్నారు.

 

రాజధాని మహిళలపై జరిగినదాడిని హైకోర్టు సుమోటోగా స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు వచ్చిందని  దివ్యవాణి తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న సినిమా ప్రముఖులంతా అమరావతి ఉద్యమానికి మద్ధతివ్వాలని ఆమె విజ్ఞప్తిచేశారు. అమ్మఒడి పథకం తెచ్చామని, ఇంగ్లీ షు మీడియం తీసుకొచ్చామని గొప్పగా చెబుతున్న పాలకులంతా, నేడు తమని ఆంగ్లంలో ప్రశ్నిస్తున్నవారంతా ఇదివరకే రాష్ట్రంలోనే ఉండి ప్రతిభాపాటవాలు సాధించార నే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. గతంలో రాష్ట్రమహిళాకమిషన్‌ చైర్మన్‌గా ఉన్న నన్నపనేని రాజకుమారి, జాతీయస్థాయిలో మహిళలకు జరిగిన అన్యాయంపై గళమెత్తా రని, ఇప్పుడున్న పద్మ సోషల్‌మీడియాలో డప్పుకొట్టుకుంటూ కాలం గడుపుతోందని  దివ్యవాణి మండిపడ్డారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: