భోగమంటల్లో జగన్ గారి ఫోటోలు,బోస్టన్ కమిటి,జిఎన్ రావు కమిటి రిపోర్ట్ లు వేయడం దుర్మార్గమని వైఎస్ ఆర్ సీపీ నేత, మాజి ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. వాటిని భోగమంటల్లో వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అవి ప్రభుత్వ రికార్డులలో పదిలంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఏవైతే ఇన్సెంటివ్స్ పొందారో ఆ డాక్యుమెంట్స్ ను, ఆయన అక్రమాల తాలూకా డాక్యుమెంట్స్ ను తగులబెడితే బాగుండేదని హితవు చెప్పారు. చంద్రబాబు బ్లాక్ మనీ వైట్ గా మార్చడం కోసం పెట్టిన హెరిటేజ్ కంపెనిని పెట్టారు. దానిని ఫ్యూచర్ గ్రూప్ కు విక్రయించారు. వాటి డాక్యుమెంట్స్ తగులబెడితే బాగుండేది . ఆ ఆస్తులు ప్రభుత్వానికి చెండివేనన్నారు. ఇక ముఖ్యమంత్రి వై ఎస్ జగనమొహం రెడ్డి  రాష్ర్టంలోని ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్నారనేది చంద్రబాబు అండ్ కో గుర్తించాలన్నారు.

హైదరాబాద్ లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు తనపై ఉన్న కేసు కారణంగా హడావుడిగా తరలించారని విమర్శించారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామిలతో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. రాజధానిలో మీ మంత్రులు. ఎమ్మెల్యేలు అనుమాయులు చేసిన దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. మీ కుమారుడుని సైతం ఓడించారని గుర్తు చేశారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఇటీవల ఎన్నికలలో ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేశారన్నారు. 

రాజధానిగా అమరావతి ప్రకటన రాజ్యాంగవిరుధ్దమన్నారు. రాజధానిలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతించారు. చంద్రబాబు రిఫరెండం అని అంటున్నాడు. ఆంధ్ర రాష్ర్ట ప్రజలు 151 సీట్లతో ఒక భరోసాతో జగన్ ని గెలిపించారన్నారు. మేం మా ఎమెమ్మెల్యేలను రాజీనామా చేయిస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్టు అవుతుందన్నారు. చంద్రబాబు ఛాలెంజ్ ను స్వీకరించడానికి సిధ్దంగా ఉన్నామన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతోను, నీ బినామీలు బిజేపికి పంపించినవారితో, చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికలలో నిలుచోబెడితే బాగుంటుందని సూచించారు. సినిమాటిక్ గా డైలాగ్ లు ఎవరో రాసిస్తే చంద్రబాబు వల్లెవేస్తున్నాడు. ఆర్దిక మూలాలు పోతున్నాయని చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు. రాష్ర్టాన్ని చంద్రబాబు అప్పుల పాలు చేశారు. ఇప్పుడేమో  జోలె పట్టుకుని చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: