వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు.  ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు అంటూ ట్విట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే...                        

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తు.. ''అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు.  ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు." అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏం చేస్తాం సర్.. యువకుడి చేతిలో ఓడిపోయినందుకు అవమానంగా ఫీల్ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు. ఈ ట్విట్ కు ఎంతోమంది నెటిజన్లు సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ట్విట్ అటు వైసీపీ అభిమానులను.. ఇటు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిపించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: