వల్లభనేని వంశీ.. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం గెలచుకున్న అతి తక్కువ సీట్లలో ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం టీడీపీ 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి వాటిలో కృష్ణా జిల్లాలోని గన్నవరం ఒకటి. ఇక్కడ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత క్రమంగా జగన్ వైపు అడుగులు వేశారు.

 

చంద్రబాబు, లోకేశ తీరును తూర్పారబట్టిన వంశీ.. జగన్ తో భేటీ తర్వాత.. టీడీపీ కు రాజీనామా చేశారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు. అయితే అసెంబ్లీలో మాత్రం వేరుగా కూర్చొంటున్నారు. అలాంటి వంశీ.. భోగి పండుగ రోజు.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

 

గుడివాడ నుంచి హెలికాప్టర్‌లో వంశీని సీఎం జగన్‌ తన నివాసానికి తీసుకెళ్లారు. ఆయనతో 45 నిమిషాలు సీక్రెట్ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ భేటీ దేని కోసం అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు.

 

అలా చేరితే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. ఆ సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయో చెప్పలేం.. అందుకే వంశీ ఈ విషయంలో రిస్క్ ఇంకా తీసుకోవడం లేదు. అయితే ఇదంతా జగన్ వ్యూహంలో భాగంగానే జరుగుతోందని ఓ టాక్ ఉంది. అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న దానిపై వల్లభనేని వంశీ జగన్ తో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

 

మరోవైపు తాజాగా రాజధాని మార్పు అంశం.. కృష్ణా జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపైనా జగన్, వల్లభనేని వంశీ మధ్య చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఈ చర్చల సారాంశం ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: