అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ షేర్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. ఫొటోను చూసి ఆనందిస్తున్న అభిమానులు అదే సమయంలో  ఓ లోపముందంటూ  తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ ఆ లోపమేంటంటే  చిరింజీవి సోదరులు నాగుబాబు, పవన్ కల్యాణ్ లేకపోవటమేనట. నాగుబాబు మిస్సయ్యారంటే ఎవరికీ పెద్దగా నెగిటివ్ ఆలోచనలు రావటం లేదు. సమస్యంతా పవర్ స్టార్ కనిపించకపోవటం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

 

కనిపిస్తున్న ఫొటోలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ, వైష్ణవ తేజ, మెగా అల్లుడు కల్యాణ్ దేవ్, చివరకు పవన్-రేణుదేశాయ్ ముద్దుల కొడుకు అకీరా నందన్ కూడా కనిపిస్తున్నాడు. నిజానికి అందరూ తమ తమ సినిమాలతో 24 గంటలూ ఫుల్లుగా బిజీగా ఉండేవారే అనటంలో సందేహం లేదు. కాకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా వారసులంతా ఒకేచోట చేరటంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

 

అయితే ఇంతమంది ఒకచోట చేరి ఫొటోతో తమ అభిమానులను హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేసినపుడు పవన్ కల్యాణ్ ఎందుకు లేరు అన్నదే పవర్ స్టార్ అభిమానులను తొలిచేస్తోంది.  ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే  చాలా కాలంగా పవన్ కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉందంటే కనిపించటం కూడా తక్కువని అందరికీ తెలిసిందే.  సినిమా ఫంక్షన్లలో కూడా కనిపించటం అరుదే. కాకపోతే చిరంజీవి ఆహ్వానిస్తే మాత్రం వస్తున్నారు.

 

అలాంటిది చిరంజీవి ఇంట్లో జరిగే పండుగకు పవన్ గైర్హాజరవ్వటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పవన్ ఎప్పుడు ఎవరితో ఎలా వ్యవహరిస్తారో కూడా తెలీదు. అందులోను ఈ ఫొటోలో అకీరా నందన్ కూడా కనబడుతున్నాడు. కొడుకున్న విషయం తెలిసి రాలేదా ? లేకపోతే ఇంతకన్నా ఇంపార్టెంట్ పనుండి రాలేకపోయారా ? అన్నదే అభిమానులను తొలిచేస్తోంది. అయినా  పవన్ కు ప్రస్తుతం అంత ఇంపార్టెంట్ పనేముందబ్బా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: