బీజేపీ, జనసేన కలసి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ ఇవాళ ప్రకటన చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు వారి కలయికపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ, జనసేన కలయికను ఎద్దేవా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ముందుగా ఎంపీటీసీగానో, సర్పంచ్‌గానో గెలవాలనివెటకారం ఆడుతున్నారు.

 

బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. “ 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే మాకు, ఆ కుటమికి వచ్చిన తేడా ఒకటిన్నర ఓట్ల శాతం మాత్రమే. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఒకటిన్నర శాతం, జనసేనకు ఐదు, ఆరు శాతమే వచ్చింది. ముందు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో గెలవమని చెప్పండి. 2024లో అధికారంలోకి వచ్చేది దేవుడెరుగు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావాలని కోరుకోవడంలో సహజం. దానికన్న ముందు నాయకుడన్నవారు గెలవాలి కదా? అన్నారు అమర్ నాథ్.

 

అంతే కాదు.. ఇంకా ఏమన్నారంటే.. “ పవన్‌ 2014లో పార్టీ పెట్టినప్పుటి నుంచి బీజేపీకి, టీడీపీకి ప్రేయసిగా ఉన్నారు. బీజేపీ, టీడీపీ మధ్యలో గ్యాప్‌ వచ్చింది కాబట్టి.. దాన్ని కవర్‌ చేసేందుకు చంద్రబాబే పవన్‌ను బీజేపీ వద్దకు పంపించి ఉంటారని అనుమానంగా ఉంది. ఎన్నికల్లో ఎలాగు పవన్‌ గెలవలేరు కాబట్టి రాజ్యసభ ఎంపీ, లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీ నడిపే వ్యక్తికి సిద్ధాంతాలు చాలా ముఖ్యం. వ్యక్తిత్వం అన్నది ముఖ్యం. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా పవన్‌కు లేవు.. అంటూ విమర్శలు గుప్పించారు అమర్ నాథ్.

 

కమ్యూనిస్టులతో కలిసి గతంలో పోటీ చేసిన పవన్‌ .. ఇల్లీగల్‌ పొత్తులు పెట్టుకున్నారు. ఆ రోజు పాచిపోయిన లడ్డులు అని చంద్రబాబు చెబితే పవన్‌ తిట్టారు. ఈ రోజు చంద్రబాబును కాపాడుకునేందుకు మళ్లీ బీజేపీతో కలిసి పవన్‌ ముందుకు వెళ్తున్నారు. కులతత్వం, మతతత్వ రాజకీయాలను రాష్ట్రంలో ప్రజలు నిర్మూలించారు.. అంటూ పవన్ తీరుపై అమర్ నాథ్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: