సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది. మనుషుల ప్రాణాలు తీయడానికి కనీసం వెనక ముందు కూడా ఆలోచించడం లేదు జనాలు. ఇక నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అక్రమ సంబంధాలతో జరుగుతున్న హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఆనందంలో గడిసిపోతున్న ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అవ్వగానే అసలు వివాదం మొదలవుతుంది. దీంతో అక్రమ సంబంధం మోజులో పడిన వాళ్ళు తనకు అడ్డుగా ఉన్న వారిని చంపేందుకు వెనకాడడం లేదు. పక్కా ప్లాన్ వేసి మరీ ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకోటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అక్రమ సంబంధాల నెపంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. 

 

 

 తాజాగా ఇలాంటి దారుణ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరదలు తో అక్రమ సంబంధం పెట్టుకుని మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచి చివరి వరకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేసిన భర్త తన  భార్యను కిరాయి మనుషులతో హత్య చేయించాడు. గజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కొంత కాలం క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆ వ్యక్తి భార్య నిండు గర్భిణీ గా ఉంది. దీంతో తన భార్యకు సపర్యలు చేసేందుకు వచ్చిన మరదలితో ఆ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

 

 

 

 విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మరదల్ ని గదిలోకి తీసుకెళ్లి రాసలీలలు కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇక ఆ యువతి కూడా అక్క కు అన్యాయం చేస్తున్నానని ఆలోచన లేకుండా భర్తతో అక్రమ సంబంధం కొనసాగింది. భార్య తొలగించుకుంటే మరదలును  పెళ్లి చేసుకోవచ్చు అని భావించాడు దుర్మార్గపు భర్త . భార్యను చంపటానికి ఓ ముఠా తో ఒప్పందం  కుదుర్చుకున్నాడు.ఆ ముఠా  ఆ వ్యక్తి భార్య ను చంపేందుకు రెండుసార్లు ఆహారంలో  వియం కలిపిన  విఫలం అయ్యారు  దీంతో ఈ నెల 12న దొంగల రూపంలో ఇంట్లోకి ప్రవేశించి ఆమె గొంతు కోసి చంపేశాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తపై అనుమానంతో తమ దైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో భర్తతో పాటు హంతకులను కూడా కటకటాల వెనుకకు చూశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: