ఈ సంక్రాంతి బరిలో కామెడీ దర్శకులు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీస్ ఢీ అంటే ఢీ అనేలా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అయితే ఈ రెండు మూవీస్ కన్నా ముందు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ మూవీ రిలీజ్ అయ్యింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన నటించిన సరిలేరు నీకెవ్వరు పై మొదటి నుంచి భారీ అంచనాలే పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పదమూడేళ్ల తర్వాత నటి విజయశాంతి నటించింది. కామెడీ ట్రాక్ తో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి విజయంగా నిలిచింది. ప్రస్తుతం కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇక విఘ్నేష్ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ మూవీ పెద్దగా హిట్టు కాకపోవడంతో ఈ రెండు మూవీస్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేక పోయింది. అల్లు అర్జున్, మహేష్ సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ వచ్చింది. టాక్లతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు వచ్చాయి. రెండు సినిమాలకు ఇప్పటికే రు.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ప్రతిఏడు సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు సందడి చేయడం సహజమే.. కానీ ఏదొ ఒక మూవీ మాత్రమే సక్సెస్ బాటలోనడుస్తుంది. ఈసారి అల వైకుంఠపురములో కి భారీ స్పందన వచ్చింది.. ఎందుకంటే ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా అల వైకుంఠపురములో సామజవరగమన, రాములో రాముల యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే సరిలేరు నీకెవ్వరు మూవీకి మాత్రం కామెడీ ఎంట్రటైన్ గానే అలరించింది.. మ్యూజికల్ గా పెద్దగా డామినేషన్ చేయలేక పోయింది.