విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతుంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.         

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ?'' అంటూ సంచలన ట్విట్ పెట్టారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. దోచుకోవడం సింగపూర్ లో దాచుకోవడం బాబు కు వెన్నతో పెట్టిన విద్య అన్న అని ఒకరు కామెంట్ చేస్తే.. మరికొందరు కామెంట్ చేస్తూ.. అవునవును..బలే చెప్పారు అంటూ కామెంట్ చేశారు.  ట్విట్ కు ఎంతోమంది నెటిజన్లు సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ట్విట్ అటు వైసీపీ అభిమానులను.. ఇటు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: