అమరావతిలో రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతి మొత్తం తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే రాజధాని మార్పును నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న నిరసనలకు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు రైతుల తోనే ఉంటూ రైతులు నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పర్యటన కోసం నందమూరి నారా కుటుంబాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలని రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించ వద్దు అంటూ రైతులు చేస్తున్న దీక్షకు ఇప్పటికే నారా నందమూరి కుటుంబాల మద్దతు ప్రకటిస్తున్నాయి. 

 

 టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతిలో పర్యటిస్తుండగా... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణి తో కలిసి అమరావతి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి రోజున నందమూరి కుటుంబం కూడా వచ్చింది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులందరికీ మద్దతు ప్రకటించారు. అయితే నారా కుటుంబం నందమూరి కుటుంబం వచ్చినప్పటికీ నందమూరి బాలకృష్ణ మాత్రం రాలేదు. నందమూరి బాలకృష్ణ కనుమ రోజు అమరావతిలో  పర్యటనకు వస్తారని తమకు మద్దతు ప్రకటిస్తారని రాజధాని రైతులు ఆశగా ఎదురుచూశారు. బాలకృష్ణ మద్దతుతో తమకు కొన్ని వర్గాల మద్దతు తెలుపుతారని... అంతే కాకుండా టాలీవుడ్ నుంచి కొంతమంది ప్రముఖులు కూడా తమకు మద్దతు తెలిపేందుకు వస్తారని ఆశపడ్డారు. 

 

 


 కానీ బాలకృష్ణ మాత్రం రాలేదు... అయితే కనుమ రోజు బాలకృష్ణ అమరావతి పర్యటనకు రాకకపోవడానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. బాలకృష్ణ అమరావతి రాకపోవడానికి కారణం నక్షత్ర బలం లేకపోవడమట . ముహూర్తాలను ఎక్కువగా బాలకృష్ణ నమ్ముతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. దీంతో కనుమ రోజు గురువారం నక్షత్రం బలం ముహూర్తం లేకపోవడం వల్లే ఆయన అమరావతి పర్యటనకు దూరంగా ఉన్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే సినీ రాజకీయ ప్రముఖులు ముహూర్తాలు ఎక్కువగా నమ్ముతారు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: